Friday 1 October 2021

శ్రీ హనుమద్భాగవతము (42)



వాలి తన సోదరుడైన సుగ్రీవుని పై కత్తి గట్టి యున్నాడు. భయాక్రాంతుడైన సుగ్రీవుడు ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నాడు. అందువలన నీవు ఋష్యమూక పర్వతము మీదకు వేళ్ళి సుగ్రీవునితో సఖ్యము చేసుకో. నేను ఆ ప్రక్కన నివసించే మారీచుని, సుబాహుని, తాటకిని ఉద్ధరించి కొద్ది దినములలోనే దండకారణ్యములో ఖరదూషణులు, త్రిశిరుడు, శూర్పణఖవంటి కంటక ప్రాయులను తొలగించుచు ఋష్యమూకము వైపునకు వస్తాను. అచట నీవు నాతో సుగ్రీవుని కలుపు, వానర సైన్యముల ద్వారా నా అవతార కార్యమున సహాయపడు.”


హనుమంతుడు తన ప్రభువును వీడుటకు ఇష్టపడుట లేదు, అయినను ప్రభువాజ్ఞను పాలించుటయే ముఖ్యకర్తవ్యము. ఆయన శ్రీరాముని చరణములకు ప్రణమిల్లి, కళ్యాణమయములైన ఆయన మధుర నామములను జపించుచు ఋష్యమూక పర్వతమునకు బయలు దేరాడు.


సుగ్రీవ సచివుడు


ఋక్షరాజగు వానరునకు వాలి సుగ్రీవులను ఇరువురు పుత్రులున్నారు.* 


* వానరేంద్రం మహేన్రాభమింద్రో వాలినమాత్మజమ్ 

సుగ్రీవం జనయామాస తపన స్తపతాం వరః 


దేవతలకు రాజైన ఇంద్రుడు వానర రాజైన వాలిని పుత్రరూపమున కన్నాడు, అతడు మహేంద్రపర్వతమువలె విశాలకాయుడు, బలిష్ఠుడు. తపించువారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని కన్నాడు (వా.రా.1-17-10) 



తండ్రి తనకుమారులిరువురిని ఒకేవిధముగా ప్రేమింస్తుండేవాడు. బాలులు ఇద్దరు గొప్ప వీరులు, ధీరులు, బలవంతులు, బుద్ధిమంతులు, సుందరులు. వారి అన్యోన్యము ప్రేమ కలిగియుంన్నారు. వాలి సుగ్రీవుని ప్రాణములతో సమానముగా ప్రేమిస్తాడు. సుగ్రీవుడు వాలిపై తండ్రివలె శ్రద్ధాభక్తులు చూపేవాడు. సోదరులిద్దరూ భోజనశయనక్రీడాదులను ఒకే విధంగా నిర్వహించుచుండేవారు. వారెప్పుడూ కలిసియే ఉండేవారు.  


No comments:

Post a Comment