Saturday 18 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 105 వ భాగం



దానిని విష్ణు హృదయంపై చేస్తున్నట్లు విగ్రహాన్ని మలిచారు. అందువల్ల మొత్తం విగ్రహం అంతా కప్పబడి త్యాగరాజు ముఖమే కనబడుతుంది. అంతేనే కాని, శివ విష్ణువులు శత్రువులు కారు. మాటిమాటికీ ఆలయాలు మారిపోయాయని భావించకూడదు.


విష్ణువు ధ్యానంలో ఉండి శివతాండవాన్ని తన హృదయంలో వీక్షిస్తూ ఆ ఆనందంలో ఆవేశానికి లోనయ్యాడు. ఆదిశేషుడు, ఆవేశపూరితుడైన విష్ణువు బరువును భరించలేకపోయాడు. ఈరోజు ఇంత బరువున్నారేమిటని విష్ణువు నడిగాడు. పరమేశ్వరుడు నా హృదయంలో నర్తనం చేస్తున్నాడు, అదే కారణమన్నాడు విష్ణువు.


సంతోషం వల్ల బరువు అనినపుడు అది అద్వైతం అవుతుంది. ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడనినపుడు, అనగా ఇద్దరూ ఒకచోట కలిసినపుడు ద్వైతం. ఆ అద్వైతాన్ని చూపించకుండా ఉండడం, విగ్రహాన్ని కప్పుతారు. అందుచేత సాధారుణులకు ద్వైతమూర్తిగానే కన్పిస్తాడు. కాని అద్వైత దర్శనం ఇప్పించాలి. ఆదిశేషుడు ఏమి అడుగుతాడో తెలుసు. ఈ పని ఆదిశేషుని ద్వారా జరగాలని భగవత్ సంకల్పం.


ఈ ఈశ్వర నృత్యాన్ని తాను చూడాలని ఆదిశేషుడడగాలి. అపుడతనిని చిదంబరం పంపించి చూపించాలి. తద్వారా చిదంబర మహాత్మ్యం నల్గురికీ తెలుస్తుంది. ఇది భగవంతుని ఆలోచన.


తిరువారూర్ లో జన్మిస్తే, మోక్షమని ఒకమాట. "జననాత్ కమలాలయే" అయితే పుట్టడం మన చేతిలో ఉందా? చిదంబరంలో దర్శనం వల్లనే ముక్తి, 'దర్శనాత్ అభ్రసదసి' ఎక్కడ పుట్టినా అక్కడకు వెళ్ళితే చాలు. మోక్షం వస్తుంది. మోక్షానికి దారి చూపిస్తుంది. 


No comments:

Post a Comment