Saturday 25 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 112 వ భాగం



ఇది కేవలం, మాయ యొక్క ఊసెత్తని అద్వైత గ్రంథం, మొదటి భాగాన్ని ఆగమ ప్రకరణ మంటారు. మొత్తం గ్రంథాన్ని ఆగమశాస్త్రమంటారు. మామూలుగా ఆగమశాస్త్రం అంటే, దేవాలయ పూజాదులకు సంబంధించింది. కాని ఇది మాత్రం, అద్వైత వేదాంతానికి సంబంధించింది.


ఈ గ్రంథంలో మాయా ప్రస్తావన లేకపోయినా గౌడపాదుడు అమ్మవారి భక్తుడు కనుక ఆమెను బ్రహ్మ విద్యా స్వరూపిణిగా, మాయా స్వరూపిణిగా భావించాడు. సుభగోదయం అనే శ్రీవిద్యా తంత్రగ్రంథాన్ని రచించాడు.


జ్ఞానము భక్తి


కర్మ భక్తి మార్గాలలో పరిపక్వత గడిస్తే ద్వైత ప్రపంచం మాయగా భావించి జ్ఞాన మార్గంలో అడుగిడినపుడు ఇక ఈశ్వరుని భజించడం ఉండదు. జగత్తును మాయగానే భావిస్తాడు. మరొక రీతిలో ఈశ్వరుని పట్ల భక్తిని చూపిస్తాడు. తాను నిర్గుణుడని తెలిసినపుడు సగుణంలో ఉన్న ఈశ్వర లీలలను చూసి వినోదిస్తాడు, ప్రార్థిస్తాడు. ఆ స్థితిలో ప్రాణుల పట్ల అనుకంపను చూపించి, భక్తునిగా ప్రవర్తిస్తూ ప్రజల బాగుకోసం స్తోత్రాలు వ్రాస్తాడు. పఠిస్తాడు.


శుకుడే భాగవతోపదేశం చేయలేదా? శంకరులట్టి దశలో స్తోత్రాలు వ్రాయలేదా?


గోవా దగ్గర శిరోదా అనే ప్రాంతంలో గౌడపాదాచార్య మఠం ఉంది. గౌడసారస్వత బ్రాహ్మణులు, ఈ మతానుయాయులు. ఇట్లా ఈ నర్మదా ప్రాంతం, జాతీయ సమైక్యానికి తోడ్పడింది. గౌడుడు, బెంగాల్ నకు చెందగా, శంకరులు ద్రవిడ దేశానికి చెందగా గోవింద భగవత్పాదులు కాశ్మీరునకు చెందిన సారస్వత బ్రాహ్మణుడు. ఇట్లా నర్మదా ప్రాంతం అందరికీ కూడలిగా మారింది.


No comments:

Post a Comment