Sunday 26 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 113 వ భాగం



శంకరుల స్తుతి


శంకరులు, గౌడపాదుని కారికలపై భాష్యం వ్రాసారు. ఆ గ్రంథం చివర సంసార సముద్రంలో చిక్కుకొన్న సామాన్యులకు, దేవతలకు కూడా దుర్లభమైన జ్ఞానా మృతాన్ని దయతో పంచి పెట్టారని నుతించారు. పరమ గురువులను పూజ్యులకు పూజ్యునిగా, మహాపూజ్యునిగా కీర్తించారు.


"పూజ్యాపి పూజ్యం పరమగురు మముం పాదపాతైర్నతోఽస్మి" అని అన్నారు.


జ్ఞాన సముద్రాన్ని మధించి గౌడపాదులు అద్వైతామృతాన్ని అందించారని పేర్కొన్నారు.


గోవిందుని పేరు చివర, శంకరుల పేరు చివర భగవత్పాదులని ఉంటుంది. గౌడపాదులనేది వ్యవహారం. అది పూజ్యపాదకం. ఇక చంద్రశర్మ, శంకరుల గురువైన గోవింద భగవత్పాదులెట్లా అయ్యారు?


చంద్రశర్మ వృత్తాంతం


పూర్వ జన్మలో చంద్రశర్మ, పతంజలియే. గౌడుని బ్రహ్మరాక్షసునిగా పతంజలి శపించాడు. కాని తానందించిన భాష్యం లోకంలో ప్రచారం కావాలి.


No comments:

Post a Comment