Sunday 12 June 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 99 వ భాగం





సదాశివ బ్రహ్మేంద్రులు కూడా జీవన్ముక్తులే. రెండు శతాబ్దాల వెనుక నున్నవారు. వారు తమ గురురత్న మాలికలో శుకుని గూర్చి ఇట్లా అన్నారు:


"జననీ జఠరాదిన చ్యవన్యో 

జగతో నాద్రవత్ ఆత్మవిత్ విపధ్భ్యః 

అనహంత మహంత మాత్మవంతం 

భగవంతం శుకమాశ్రయే ప్రశాంతం"


అనగా శ్లోకంలోని రెండవ భాగంలో అహంకారం లేని ఆత్మనెరిగిన శుకుణ్ణి, ప్రశాంతుని, భగవత్ స్వరూపాన్ని శరణు జొచ్చుతున్నానని అర్థం. మొదటి భాగంలో తల్లి గర్భం నుండి రాగానే ఆత్మజ్ఞానం కలిగిందని, ప్రాపంచిక వాసనలు, అణుమాత్రం లేనివాడని పొగిడారు. 'జననీ జఠరాత్' అన్నారు. అదే మాట భజగోవింద స్తోత్రంలో జననీ జఠరే శయనం" అని : ఉంది.

శుకుని గొప్పదనం భాగవత శ్లోకం అందించింది:


యం ప్రప్ర జంతం అనుపేతం అపేతకృత్యం

ద్వైపాయనో విరహకార ఆజుహావ

పుత్రేతి తన్మయతయా తరవో ఖినేదుః

తం సర్వభూత హృదయం మునిం ఆనతోఽత్మి 


వానికి నమస్కారం అని ఉంది కాని వారి పేరు శ్లోకంలో లేదు. 'సర్వభూత హృదయం మునిం' = అందరి హృదయాలలోనూ ఉండే మునియని మాత్రమే ఉంది. అనగా పరబ్రహ్మ స్వరూపుడన్నమాట. శుకుడని పేరు చెబితే అతడొక జీవుడని భావిస్తారు కనుక అట్లా చెప్పలేదు. అనగా నామ రూపాలను దాటినవాడని తెలుస్తోంది.


No comments:

Post a Comment