Saturday 17 October 2015

స్కందమాత

దుర్గామాత పంచమ స్వరూపం స్కందమాత నామంతో ప్రఖ్యాతి చెందింది. స్కంధ భగవానుడే కుమార, కార్తికేయ నామంతో వ్యవహరించబడుతాడు. ప్రసిద్ధ దేవాసుర సంగ్రామంలో ఈయనే దేవసేనాధిపతి. పురాణాలు ఈయన్ను కుమారుడని, శక్తిధరుడనీ, మయూర వాహనుడని అంటాయి. ఆయన మహిమలు వాటిలో కీర్తించబడ్డాయి. ఈ స్కందదేవుడి జనని కావడం వల్లనే దుర్గా మాత యొక్క ఈ పంచమ స్వరూపం స్కంద మాత నామంతో విఖ్యాతి చెందింది. నవరాత్రులలో పంచమ దినాన స్కబ్దామత ఉపాసన జరుగుతుంది.

ఈనాడు సాధకుడి మనస్సు ‘విశుద్ధ’ చక్రంలో లయమై ఉంటుంది. స్కంద దేవుడు బాలరూపంలో ఈ తల్లి ఒడిలో ఆసీనుడై ఉంటాడు. స్కంద మాతృస్వరూపిణికి చతుర్భుజాలు. ఈమె దక్షిణంగా ఉన్న పైకి లేచిన చేతిలో స్కందబాలుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఉంటుంది. అదే వైపున ఉన్న కింది చేయి వరముద్రతో ఉంటుంది. పై రెండు చేతులలో పద్మాలు ఉంటాయి.సంపూర్ణంగా శుభ్రవర్ణంలో విరాజిల్లే ఈ తల్లి కమలాసనంపై ఉంటుంది. అందుకే ఈమెను పద్మాసనాదేవి అని కూడా పిలుస్తారు. ఈమె వాహనం సింహం. నవరాత్రి దీక్షలోని పంచమ దివసానికి విశేషతత్వము ఉన్నట్లు శాస్త్రాలు వర్ణించాయి. పంచమ దినం నాడు సాధకుడి మనస్సు విశుద్ధ చక్రంలో లయమై ఉంటుంది. ఈ చక్రంలో స్థిరమనస్కుడైన సాధకుని బాహ్యక్రియలూ, చిత్తత్పత్తులూ లోపించి ఉంటాయి. అతని మనస్సు విశుద్ధ చైతన్యం వైపు పురోగమిస్తూ ఉంటుంది.

దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

సేకరణ - సూర్యదినపత్రిక 2011
http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658

No comments:

Post a Comment