Monday 19 October 2015

లక్ష్మి పూజ - సద్గుణ సముపార్జన

లక్ష్మి పూజ సద్గుణ సముపార్జన

మలి మూడు రోజులు : లక్ష్మి పూజ

దుర్గాదేవి ఆరాధనతో మలినమైన వాసనలు, చెడుస్వభావాలు, పాత అలవాట్లు లాంటి వ్యతిరేక గుణాలను నిర్మూలించే ప్రయత్నంలో సఫలీకృతుడవు కాగానే... నాశనం అయిన ఆ అసురగుణాల స్థానంలో సకారాత్మక గుణాలను, ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం నీ తక్షణ కర్తవ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టీకరించిన దైవీ సంపదలను ఆర్జించుకోవాలి. జ్ఞానరత్నమనే అపూర్వమైన మణిని, ఆధ్యాత్మిక సంపదను సముపార్జన చేయాలి. శ్రద్ధాసక్తులతో ప్రతిపక్ష భావనను అలవరచుకునే ప్రయత్నం చేయని పక్షంలో పూర్వపు అసురీ గుణాలు మళ్లీ మళ్లీ తలెత్తుతాయి. అందుకే సాధకుడి అభ్యాసదశలో పూర్వ దశ ఎంత విలువైనదో, ఈ దశకూడా అంతే విలక్షణమైంది. తొలిదశ మలిదశల మధ్య ముఖ్యమైన తేడా వుంది. తొలిదశలో మలినమైన, అహంకార పూరిత హీనస్వభావాలను నిరంకుశంగా, నిశ్చయాత్మక బుద్దితో నిర్మూలన చేస్తే, మలిదశలో క్రమబద్ధంగా, కృత నిశ్చయంతో, దృఢంగా, ప్రశాంతంగా, పవిత్రమైన నిర్మలత్వాన్ని వృద్ధి చేసుకోవడం, మహాలక్ష్మి ఆరాధన ద్వారా సాధకుడి, సాధనలో వుండే ఆనందమయ దశ వ్యక్తీకరణ జరుగుతుంది. మహాలక్ష్మి తన భక్తులకు అనంతమైన దైవీ సంపదలను ప్రసాదిస్తుంది. సంపదలను ప్రసాదించే బ్రహ్మస్వరూపమే మహాలక్ష్మి. ఆమె అత్యంత నిర్మలం. రెండవ దశలో మూడు రోజులపాటు #మహాలక్ష్మి ఆరాధన జరుగుతుంది.

- స్వామి శివానంద సరస్వతీ (1887-1963)

సేకరణ: http://goo.gl/WqQGqB

No comments:

Post a Comment