Monday 19 October 2015

హిందూ ధర్మం - 180 (నిరుక్తము - 3)

మహాభారత యుద్ధానికి పూర్వం వరకు వేదానికి నిరుక్తము, శాస్త్రీయ, గూఢార్ధ పద్ధతుల ద్వారానే భాష్యం స్వీకరించడం జరిగింది. యుద్ద్గం ముగుసి కలియుగం ప్రారంభమైన తర్వాత ఈ పద్ధతిలో కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. కానీ భారతదేశంపై మహమ్మదీయ దండయాత్రలు మొదలైన తర్వాత మొత్తం పరిస్థితి తారుమారైంది. అవి జరగడానికి ముందే ఈ దేశంలో జైనం, భౌద్ధం వంటి మతాలు ఉద్భవించాయి. బౌద్ధమత విస్తరణ కోసం బౌద్ధాన్ని స్వీకరించ్న రాజులు వైదిక మతంపై దాడులు జరిపి, ధార్మిక గ్రంధాలను కాల్చివేశారు, వాటికి వక్రభాష్యాలిచ్చారు, భౌద్ధ పరమైన, నాస్తికమైన అర్దాలను అన్వయం చేశారు. గురుకుల వ్యవస్థను, ఆశ్రమ వ్యవస్థను నిర్వీర్యం చేసే యత్నం చేశారు. అటువంటి సందర్భంలో క్రీ.పూ.7 వ శత్బాదంలో వచ్చినవారే ఆదిశంకరులు. దేశంలో ఎక్కడ చూసినా, వక్రభాష్యాలే, నాస్తిక వాదమే. అటువంటి సమయంలో గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేసిన శంకరులు, తన మేధాశక్తితో వేదానికి ఇచ్చిన అవైదిక, వక్రభాష్యాలను ఖండించి, శాస్ర్తీయమైన అర్దాన్నిచే ప్రయత్నం చేశారు. వారి తర్వాత 1500 ఏళ్ళ పాటు వారి ప్రభావం కొనసాగింది.

కానీ మహమ్మదీయ దండయాత్రలు కొత్త పోకడలను తీసుకువచ్చాయి. వైదిక ధర్మం తార్కిక ఆలోచనకు, తాత్త్వికతకు, బుద్ధి వికసనానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. కానీ అబ్రహామిక్ మతాలు అలా కాదు. (అబ్రహం అనే మూలపురుషుడి నుంచి ఉద్భవించినవిగా భావించే క్రైస్తవం, ఇస్లాం, యూదు మొదలైన మతాలు). అవి ప్రశ్నించే తత్త్వానికి, వ్యక్తి తార్కిక ఆలోచనకు అడ్డుకట్ట వేస్తాయి. ఆ దండయాత్రల్లో అనేక వైదిక గ్రంధాలు తగలబెట్టబడ్డాయి. భారతదేశానికి అక్కడి నుంచి చీకటి యుగం ప్రారంభమైంది. వాటి ప్రభావం భారతీయ సంస్కృతిపై చాలా పడింది. ఈ సందర్భంలోనే వేదాలకు నిరుక్తం ఆధారంగా అర్దం చెప్పక, పురాణాల ఆధారంగా చెప్పే పద్ధతి ప్రచారంలోకి వచ్చింది. ఇంకోకప్రక్కన దండయాత్రులు చేసిన ముష్కరులు, కొందరిని బెదిరించి, ధార్మిక గ్రంధాల్లో నూతన విషయాలను ప్రవేశపెట్టారు.

వేదాలతో పోల్చి చూసినప్పుడు పురాణాలు అత్యంత నవీన సాహిత్యం. వేదం ఈశ్వరునిలానే సనాతనం. ఈశ్వర సృష్టిలో ఉండే కోటానుకోట్ల బ్రహ్మాండాలకు సంబంధించినది. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో అప్పటికప్పుడు ఉద్భవించి, నశించిపోయే నీటి బుడగల వలే అనేక బ్రహ్మాండాలు నిత్యం ఉద్భవిస్తూ ఉంటాయి, లయిస్తుంటాయి. ఆయా బ్రహ్మాండాల్లో నడుస్తున్న యుగాలతో సంబంధం లేకుండా, అన్నిటికి వేదమే పరమ ప్రమాణం. అందుకే వేదం కాలాతీతం. కానీ ఈ పురాణమనే సాహిత్యం ఈ సృష్టిలో ఇప్పుడున్న కలియుగంలో మానవులకు ధర్మం, వేదం యొక్క సందేశం అందించడం కోసం వ్యాసుని ద్వారా ద్వాపరయుగాంతంలో ఇవ్వబడింది. ఈ పురాణల్లో అనేక కల్పాలు, మన్వంతరాలు, ఇతర సృష్టిల్లో జరిగిన సంఘటనలు కనిపిస్తాయి. అవి వేదంలో చెప్పబడ్డ ధర్మాన్ని వివరించేవే కానీ, వాటిలో ఉన్న పాత్రలను వేదంలో ఉన్న పదాలకు అన్వయం చేయడం వంటివి చేయకూడదు. కానీ ఈ దండయాత్రల ప్రభావంతో వేదాలకు కొంత పురాణాల ఆధారంగా భాష్యం చెప్పడం ప్రారంభమైంది. అదేగాక మాములు సంస్కృతార్దాలను వైదిక వాజ్ఞ్మయానికి అన్వయం చేయడం కూడా ఈ తర్వతే ప్రారంభమైంది. ఫలితంగా నిరుక్తం మూలనపడింది. 14 వ శత్బాదానికి చెందిన సుప్రసిద్ధ భాష్యకారుడైన సాయనాచార్యుడు వేదానికి నిరుక్తం, పౌరాణిక పద్ధతులలో భాష్యం అందించారు.

అటు తర్వాత ఆంగ్లేయుల దండయాత్రలు జరిగాయి. వైదిక ధర్మాన్ని నాశనం చేయడమే, తమ మతాన్ని స్థాపన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంగ్లేయులు వేదాల్లో లేని అనేక విషయాలు, ఉన్నాయని భ్రమలు కల్పించి, సంస్కృతిని కూకటివేళ్ళతో పెకిలించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వచ్చినవే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, వేదాల్లో గోవధ, జంతుబలి వంటి కల్పిత సిద్ధాంతాలు.

To be continued .................

No comments:

Post a Comment