Monday 31 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (7)



ఎంతటివారైనా పిల్లలు కాకుండ పెద్దవారు కారు. మానవుని భావి జీవితానికి బాల్యం (చిన్నతనం) పునాది. ఆ బాల్యాన్ని సరి యగు మార్గానికి మళ్ళించిన మున్ముందు ఆతని జీవితం పూలబాట కాదేని ముళ్ళబాట- సహజంగా చెడును ఆకర్షించే మనసును, ఆవైపునకు బాల్యాన పోనీయరాదు. తల్లిదండ్రులు, గురువులు — గురుతర బాధ్యతతో పిల్లలకు క్రమశిక్షణగల చదువును నేర్పించాలి అలా చేసినవాడు “చెడు కనకు- వినకు-చూడకు" అను సూక్తికి ఉదాహరణలై భావి భారత సత్పౌరులై సత్పథాన పయనించగలరు. "మొక్కయి వంగనిది మానై వంగునా" అనికదా పెద్దల సుద్ధి.


తల్లి ఆనతిపై ఆంజనేయుడు సూర్యభగవానుని చేరి "గురు దేవా! నన్ను శిష్యునిగా స్వీకరింపుము. వేద వేదాంగముల నుప దేశింపుము, జ్ఞానభిక్ష ప్రసాదింపు"మని కోరెను.


సకలశాస్త్ర మర్మజ్ఞుడు, సర్వలోక సాక్షియగు సూర్యదేవుడు "కుమారా! నేనొకచోట నిలకడగ నిలుచువాడను కాను కదా! నిరంతరం వినువీధినీ విహరించేవాడను. ఎలా విద్య నభ్యసించగలవు" అని పల్కెను.


అందుకు ఆంజనేయుడు "ప్రభూ! మీరావిషయంలో ఆలోచించవలసిన పనిలేదు” అని ఉదయాద్రిపై ఒక పాదమును, అస్తాద్రిపై మరొక పాదము నుంచి సూర్యగమనావరోధి కాకుండగ వెనుకకు నడుస్తూ ఏకాగ్రత కోలుపోక శ్రద్ధగా, ఆసక్తిగా సాంగో పాంగముగా వేదాధ్యయనము చేసి నవ వ్యాకరణములను నేర్చెను సకలశాస్త్ర పారంగతుడయ్యెను. బుద్ధిమతాం వరిష్ఠుడయ్యెను.


No comments:

Post a Comment