Monday 11 October 2021

శ్రీ హనుమద్భాగవతము (47)



అతని గర్జనమును విని పరాక్రమ శ్రేష్ఠుడైన వాలి కోపముతో బయటకు వచ్చాడు. అపుడు అతని కంఠము ఇంద్ర ప్రదత్తము, విజయప్రదాయిని యగు సువర్ణ మాలతో శోభిల్లుచుండేది. దుందుభిని చూసిన్నంతనే అతనితో యుద్ధము చేయుటకు వాలి సంసిద్ధుడయ్యాడు. దుందుభి తన కొమ్ములతో పొడుచుటకై ఎంతో వేగముగా వాలిపైకి దూకాడు. వెంటనే వాలి వాని రెండుకొమ్ములను గట్టిగా పట్టుకొని నలువైపుల వానిని త్రిప్పసాగాడు.

అప్పుడు వాలి రూపము క్రోధముతో భయంకరముగా ఉండేది. అతడు మాటిమాటికి గట్టిగా గర్జించుచుండేవాడు. ఇట్లతడు మొదట పర్వతాకారుడైన రాక్షసుని నలువైపుల త్రిప్పి బలముగా నేలపైగొట్టాడు. దుందుభి రెండు చెవులనుండి రక్త ధారలు ప్రవహింపసాగాడు.


అమితశక్తి శాలియైన దుందుభి లేచి వెంటనే మరల వాలిని ఎదుర్కొన్నాడు. వారిరువురు ఘోరముగా పోరాడసాగారు. వారొకరినొకరు చంపుకొన చూచుచుండేవారు. దుందుభి త నగిట్టలను, కొమ్ములతోను వాలిని ఎదుర్కొనుచుండేవాడు. వాలి పిడికిలి పోటులతోను, కాలితన్నులతోను, రాళ్ళతోను, వృక్షములతోను దుందుభిని కొట్టుచుండేవాడు.


వీరవరుడైన వాలి ద్బెబలచే దుందుభి బలము క్షీణింపసాగింది. చివరకు అతడు దుర్దమనీయుడైన ఆ దానవుని పైకెత్తిన సంపూర్ణశక్తితో నేలపై గొట్టాడు, దూమికి అతనిపైన తన కూర్చున్నాడు. సాటి లేని వాలి బరువును వాడు మోయలేకపోయాడు. అతని అవయవముల నుండి రక్తము ప్రవహింప సాగింది. వెంటనే వాడు నేలపై కూలి ప్ర్రాణములను విడిచాడు.


దుందుభి మరణానంతరము వాలి మిక్కిలి కోపముతో వాని శవమును ఒక యోజనము దూరము విసిరాడు. అది మతంగముని ఆశ్రమమున పడ్డాడు. వేగముగా విసరుటచే చనిపోయిన ఆ అసురుని శరీరము నుండి ప్రవహించిన రక్త బిందువులు కొన్ని మహాముని శరీరముపై బడ్డాయి.


No comments:

Post a Comment