Monday 25 October 2021

శ్రీ హనుమద్భాగవతము (57)



రాజ్యం ప్రాప్తం యశశ్చైవ కౌలీ శ్రీరభవర్ధితా

మిత్రాణాం సంగ్రహః శేష సద్భవాన్ కర్తుమర్హతి

తద్భవాన్ వృత్త సంపన్నః స్థితః పధి నిరత్యయే| 

మిత్రార్థమఖనీతార్థం యధావత్ కర్తుమర్హతి || 

తదిదం మిత్రకార్యం నః కాలాతీతమరిందమ | 

క్రియతాం రాఘవ స్యైతత్ వైదేహ్యాః పరిమార్గణమ్ || 

న చ కాలమతీతం తే నివేదయతి కాలవిత్ | 

త్వరమాణో2పి స 'ప్రాజ్ఞ స్తవరాజన్ వశానుగః || 

న హి తావత్ భవేత్కాలో వ్యతీతశ్చోదనాదృతే | 

చోదితస్య హి కార్యస్య భవేత్కా-లవ్యతిక్రమః || 

శక్తిమానితి విశ్రాంతో వానరర్క్ష గణేశ్వరః |

కర్తుం దాశరధేః ప్రీతిమాజ్ఞాయాం కిం ను సజ్జ సే ||

ప్రాణత్యాగవిశం కేన కృతం తేన మహత్రియమ్ | 

తస్య మార్గామ వైదేహీం పృథివ్యామపి చాంబరే || 

దేవదానవగంధర్వా అసురాః సమరుద్గణాః | 

న చ యక్షాభయం తస్య కుర్యుః కిమివ రాక్షసాః || 

త దేవం శక్తియు క్తస్య పూర్వం ప్రతికృతస్థథా | 

రామస్యార్హసి పింగేశ కర్తుం సర్వాత్మనాప్రియమ్ || 


(వా. రా. 4-29-9-9-12,15,16,19,21 23-25


రాజా ! నీవు ! రాజ్యమును, యశస్సును పొందావు. వంశపారంపర్యముగా వచ్చిన లక్ష్మీని వృద్ధిపఱచావు. కాని ఇంకా మిత్రులకు చేయవలసిన కార్యము మిగిలియున్నది, దానిని ఇప్పుడు నీవు నెరవేర్చవలెను. నీవు సదాచార సంపన్నము, నిత్యము, సనాతనము అయిన ధర్మమార్గమున నిలచియున్నావు. అందువలన మిత్రకార్యమును చక్కపెట్టుట్టకు నీవొనర్చిన ప్రతిజ్ఞను తగినట్లు నెరవేర్చు. శత్రుదమనుడా! శ్రీ రాముడు మనకు పరమమిత్రుడు, ఆయనకు చేయవలసిన కార్య సమయము గడచిపోవుచున్నది. అందువలన సీతా దేవికై వెదకుట ఆరంభించాలి. రాజా! పరమబుద్ధిమంతుడైన శ్రీరాముడు కాలవేత్త. కార్యసిద్ధికై నీవు త్వరపడిన ఆయన నీకు పశుడైయుంటాడు. కాలము గడస్తున్నదని సంకోచము వలన ఆయన నీతో చెప్పడు. కనుక శ్రీరాముడు చెప్పక ముందు మనము పనిని మొదలుపెడితే సమయము గడచినట్లు ఆయన భావింపడు. కాని ఆయన దీనికై ప్రేరణ కలిగించినచో మనము సమయమును గడిపామనీ, ఆలస్యం చేశావని ఆయన కార్యమున లోకమున వెల్లడి కాగలదు. వానర భల్లూకములకు ప్రభువైన సుగ్రీవా! నీవు శక్తిమంతుడవు, పరాక్రమవంతుడవు. అయినా దశరథనందనుడైన శ్రీ రామునకు ఇష్టమైన కార్యమును ఒనర్చుటకు వానరులను ఆజ్ఞాపించుటకు ఎందుకు ఆలస్యము చేయుచున్నావు? నీకై శ్రీ రాముడు వాలి ప్రాణములను తీయుటకు కూడా సందేహింపలేదు. 


ఆయన నీకు ఎంతో ఇష్టమైన కార్యము చేసాడు. అందువలన మనమి ఇప్పుడు ఆయన భార్య యైన సీతాదేవికై భూమ్యాకాశముల రెండింటి యందును వెతుకు. దేవతలు, దానవులు, గంధర్వులు, అసురులు, మరుద్గణములు, యక్షులు మున్నగు వారెవ్వరూ శ్రీ రామునకు భయమును కలిగించలేరు. ఇక రాక్షసుల విషయమై చెప్పేదేమి! వానరరాజా! ఇట్టి శక్తిశాలీ, మొదటనే ఉపకారము చేయువాడైన శ్రీరామునకు ఇష్టమైన కార్యమును నీవు నీ శక్తియుక్తులను వినియోగించి చెయ్యి. 


శ్రీరాముని కార్యమున ఆలస్యము జరిగినందులకు స్వగుణసంపన్నుడైన సుగ్రీవుడు భయగ్రస్తుడయ్యాడు. ఆయన ఎల్లప్పుడూ హనుమానుని సలహాలను గౌరవించుచుండేవాడు. ప్రేమపూర్వకముగా కర్తవ్యమును గురించి తెలియ జేసినందులకు సుగ్రీవుడు చాలా సంతోషించి వెంటనే నీలుడనే వానర వీరుని ఇట్లా ఆజ్ఞాపించాడు – ‘నీవు పదిహేను దినముల లోపల ఆ ఉద్యోగులను, శీఘ్రగాములైన యూథపతులను వీర సైనికులను నా సమీపమునకు పంపుటకు ప్రయత్నించు. ఈ గడువు లోపల ఇచటికి చేరని వానర వీరులు తమ ప్రాణములపై ఆశ వదలుకొనవలసివస్తుంది. ఇది నా ధృడనిశ్చయము'.


No comments:

Post a Comment