Wednesday 6 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 35 వ భాగం



సాంఖ్యం గః పాంచరాత్రం వేదాః పాశుపతం తథా"


అనగా ఇందులో వేదం కంటే భిన్నంగా మతాలు పేర్కొనబడ్డాయి. ఐదు మతాలలో వేదం ఉంది. అంటే మిగిలినవి అవైదికములనే కదా అర్థం! ఇక శివ మహిమ్నస్తవంలో "త్రయీ (వేదం) సాంఖ్యం యోగః పశుపతిమతం, వైష్ణవ మితి" అని ఉంది. త్రయి అంటే వేదమే. దానికి భిన్నంగా మిగతా మతాలు పేర్కొనబడ్డాయి. శివుణ్ణి కీర్తించే స్తోత్రమైనా శైవాన్ని వైదిక మతమని పుష్పదంతుడు అనలేదు.


కనుక వేద మార్గమే సత్యమైన మార్గమని మిగిలినవారు కొన్నిటిని గ్రహించి కొన్నిటిని విడిచి, కొన్నిటిని చేర్చి వైదికములనే భ్రాంతిని కల్గించారు. వీరు విద్వాంసులగుటచే బుద్ధిమంతుల్ని ఆకర్షించారు. సామాన్య జనులపై కూడా ప్రభావం చూపారు.


అట్లాగే కొన్ని తంత్రాలు వైదికములనే భ్రాంతిని కల్గించాయి. ఇక కొందరు వేదాలకంటె ఆగమాలకే పట్టం గట్టారు. అవి దేవాలయ అర్చనాదులను చెప్పేవి. వాటిని భగవంతుడే చెప్పాడని ప్రచారం చేసారు.


తాము అవైదికంగా ఉన్నా, వైదిక మతాన్ని వారెట్లా గుర్తించారో చూడండి. భగవంతుడే తంత్రాన్ని 'లేదా ఆగమాన్ని చెప్పాడని, పురాణాలలో ఇట్లా చెప్పబడిందని వాటిని ప్రమాణంగా చూపుతూ వైదిక కర్మలకు సామాన్యులను దూరంగా ఉంచారు.


No comments:

Post a Comment