Thursday 7 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 36 వ భాగం



విప్లవాత్మక మతాలు


పాతవాటిని నిర్మూలించాలని, క్రొత్తవాటిని ఏర్పాటు చేసుకుందాం అనడం చాలాకాలం నుండి నేటి వరకూ ఉంది. పూర్వకాలంలో ఈ ధోరణి తక్కువగా ఉండేది. నేడిది అధికం. వేదం ఎందుకు? మా శాస్త్రాన్ని భగవానుడే అందించాడని కొందరు, వేదము లేదు, శాస్త్రమూ లేదు. శాస్త్రమే గొప్పదని కొత్త మతాలను స్థాపించారు.


ఇట్లా బౌద్ధ జైన మతాలు వచ్చాయని చెప్పాను. అయితే పచ్చి భౌతిక వాదాన్ని చెప్పే చార్వాకాన్ని చాలామంది స్వీకరించలేదు. బౌద్ధ జైనమతాలకు రాజాదరణ లభించింది. వారిద్దరు రాజ కుటుంబాలలో పుట్టడం, అన్నిటినీ త్యజించడం, వారి ప్రవర్తన, ప్రజలకు నచ్చింది ఇక రాజపోషణ కూడా ఉంది. ఆ పైన జనులు మాట్లాడుకొనే ప్రాకృత భాషలోనే బుద్ధుడు ప్రవచనాలను సాగించాడు. జినుడు, అందరికీ ఉపయోగపడే పాఠశాలలను స్థాపించి విద్యావ్యాప్తి చేసాడు. వారి వారి మాతృ భాషలలోనే పాఠాలుండేవి. ఆ మత సిద్ధాంతాలు సామాన్య జనులకు తెలియవు. జీవితంలో వాటిని ఆచరణలో పెట్టడం తెలియకపోయినా ఆ మతాలలో జనులు చేరారు. చివరగా ఆ మతాలవారు, విగ్రహారాధనను కూడా ప్రవేశపెట్టారని చెప్పాను. అందువల్ల చేరారు.


ఈ రెండు మతాలలో శంకరుల కాలంలో జైనం ఎక్కువగా వ్యాప్తి చెందకపోవడం వల్ల దానిని ఎక్కువగా శంకరులు ఖండించలేదు. బౌద్ధమతాన్ని అక్కడక్కడ ఖండించారు. ఇక మీమాంసకులనెక్కువగా ఖండించవలసి వచ్చింది. కారణం చెబుతాను.


అవతరించుటకు తగిన పరిస్థితులు


శంకరుల కాలంలో వైదిక మతం క్షీణించింది. వైదికం కాని మతాలు కొన్ని, తాంత్రిక మతాలు కొన్ని, భగవంతుడే తమ మతాలు చెప్పాడని కొన్ని, ఇలా 72 మతాలున్నాయి. అందువల్ల ఈశ్వరుడే అవతరించవలసి వచ్చింది. కృష్ణావతారానికి, శంకరావతారానికి సంబంధం ఉంది.


No comments:

Post a Comment