Tuesday 26 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 53 వ భాగం



ఎందుకిన్ని మూర్తులు ధరించాలంటే ప్రభుత్వ కార్యకలాపాలు కూడా పెక్కుమంది నిర్వహించాలి. దేవతలు అట్లాగే ఉందని అనుకోవచ్చు. వారి కృత్యాల విభజన కూడా.


ఇక విడుదల గురించి రెండు రకాలుగా ఉంటుందని చెప్పాను. ఒకటి సంసారం నుండి దయతో విముక్తి. అనగా ప్రలయకాలంలో విముక్తి. ఆ మాటకు కూడా సంహారమని కాదు. తనలో లీనం చేసుకొనుటయే. ఇక కేవలముక్తిలో తనలో శాశ్వతంగా లీనం చేసుకుంటాడు. మొదటి లయలో పుట్టుక, మరల సంహారమూ ఉంటాయి. కాని అందులో జీవులకు తాత్కాలిక విశ్రాంతి యుంటుంది. అదీ దయతోనే. కాని చిత్తశుద్ధి కలిగిన జీవులకు శాశ్వతముక్తిని దక్షిణామూర్తి రూపంలో ఇస్తాడు.


తాత్కాలిక ముక్తినిచ్చినపుడు శాంతంతో ఇస్తాడా? అట్లా ఇస్తే ప్రజలలో భయభక్తులు లేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు కనుక ప్రలయాన్ని సంహారమూర్తి రూపంలోనే చేస్తాడు.


దేవతలకు ప్రత్యేక విధులను పరమాత్మ చేసాడని చెప్పాను. అపుడు కూడా దేవతలందరూ ఒకటే అనే భావన కలిగియుండాలి. లేకపోతే నా దేవుడు గొప్ప అని కీచులాడుకుంటారు. కనుక ముఖ్య దేవతలైన శివ, విష్ణు శక్తులు జగన్నిర్వహణ చేస్తూ తమలో భేదం లేదని ప్రకటిస్తూ ఉంటారు. కాని క్షుద్రదేవతలట్టి స్థితిలో ఉండరు. ముఖ్య దేవతలు, ఒకరి విధులను మరొకరు కూడా నిర్వహించగలరు. శాశ్వతంగా మాత్రం మార్చుకోరు.


కృష్ణునికి ముందున్న అవతారాలు కొంత కాలమే యుండి దుష్టులను, పరిహరించి ధర్మస్థాపన చేసారు. మహావిష్ణువు క్షాత్రధర్మాన్ని అనుసరించి దుష్టులను సంహరించి ప్రజలను రక్షించాడు. వారితో యుద్ధం చేసినపుడు ఈశ్వర సంహార కృత్యాన్నే చేసాడు. కృష్ణావతారంలో ఆ పని చేస్తూ సంహారాన్ని చేస్తున్నానని ప్రకటించాడు. అదే సందర్భంలో జ్ఞానోపదేశం చేయవలసిన ఈశ్వర లక్షణాలతోనూ ఉన్నాడు. పూర్వావతారాలలో ఉపదేశం లేదు.


కాని కృష్ణావతారంలో అసుర లక్షణాలు రాజులలో ప్రవేశించడం వల్ల వారిని సంహరించుటకు అర్జునునకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసాడు.


No comments:

Post a Comment