Saturday 30 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 57 వ భాగం



జ్ఞాన శివుడే జ్ఞానావతారం


ఆరోగ్యం కావాలంటే సూర్యుణ్ణి, జ్ఞానం కావాలంటే మహేశ్వరుణ్ణి వేడుకోవాలని ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది.


"ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, జ్ఞానదాతా మహేశ్వరః"


జ్ఞానము మోక్షాన్నిస్తుంది. గీత యొక్క చివరలో నన్నే శరణు పొందమన్నాడు. అన్ని పాపాలనుండి పోగొడతానని అన్నాడు. ఈశ్వరునే శరణు పొందమన్నపుడు అతనివల్లనే శాంతి లభిస్తుందని అన్నాడు. అది జ్ఞానం వల్లనే.


"తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం"


విశ్వరూప రుద్రుడు చేసే సంహారము తానూ చేస్తున్నట్లు చెప్పాడు. గీత చివరలో మోక్షాన్ని గూర్చి ప్రస్తావించేటపుడు దక్షిణామూర్తి రూపంలో ఈశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని, అది అతని కృత్యమని సూచించాడు. భేదం ఉన్నట్లుగా కన్పింపచేసాడు.


కలిలో 72 మతాలు విజృంభించగా జ్ఞానోపదేశం చేయాలి కనుక దీనిని ఈశ్వర కృత్యంగానే సంభావించాడు. 'సంభవామి యుగే యుగే' అన్నపుడు, ఇద్దరూ ఒక్కటే.


తానెన్నో అవతారాలెత్తాడు. మౌనంగానున్న దక్షిణామూర్తి సంచారం చేస్తే శిష్యగణంతో అతనికి సాయం చేస్తానని విష్ణువు సంకల్పించాడు. శంకరుల శిష్యులలో ఒకడైన పద్మపాదుడు, విష్ణ్వంశతోనే జన్మించినట్లు శంకర విజయంలో ఉంది.


No comments:

Post a Comment