Friday 29 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 56 వ భాగం



పరమ శివునితో ఐక్యమయినట్లు, కానట్లుగా ఉంటాడు విష్ణువు. విశ్వరూప దర్శనంలో నా ఈశ్వర యోగాన్ని చూడుమని అన్నాడు. చివరి అధ్యాయంలో తనకంటె ఈశ్వరుడు భిన్నుడైనట్లు ప్రకటించాడు.


"ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి 

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా"


"తమేవ శరణం గచ్చ"


అనగా అందరి హృదయాలలోనూ ఈశ్వరుడున్నాడు. మాయాశక్తి వల్ల జంత్రగాడు, యంత్రంలో ఉన్న బొమ్మల మాదిరిగా నున్న జీవులను త్రిప్పుచున్నాడు.


"అతనినే శరణు పొందు"


ఒకచోట నన్ను అని అంటాడు. మరొకచోట అతనిని అంటాడు. అయితే ఈ భేదాన్ని నిరంతరం పేర్కొంటాడా? లేదు. విభూతి యోగంలో అందరిలోనూ ఆత్మగా నున్నానని అంటాడు:


“అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః"


ఆశయమనగా హృదయం. ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నా విష్ణువు చేసే పనిని చేస్తున్నాడని ఈశ్వరః అనే శ్లోకంలో ఉంది. నన్నే శరణు పొందమని అనినపుడు విరుద్ధంగా కనబడడం లేదా? లేదు. 'మామేవం' అనగా ఒక్కడైన నేనే అని అర్థం. ఇక ఈశ్వరుడు తనకంటె భిన్నుడని అన్నాడా?


No comments:

Post a Comment