Friday 22 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 51 వ భాగం

 


సాధారణంగా మహావిష్ణువు మాయా జగత్తును రక్షిస్తే పరమశివుడు మోక్షాన్నిస్తాడు. అయితే ఒకరి పనులను మరొకరు బదిలీ చేసుకుంటూ ఉంటారు కూడా.


విష్ణువు దుష్టులను పరిమార్చేటపుడు తనలో కలుపుకొన్నపుడు రుద్రమూర్తి కాదా?


వేదంలోని శివవిష్ణుసూక్తాలు, ఇద్దరికీ భేదం లేదనే చెబుతాయి. అట్లాగే స్మృతులు కూడా. పురాణాలలో మాత్రం, శివ పురాణంలో శివుణ్ణి అధికంగా, విష్ణు పురాణాలు విష్ణువుని అధికంగా పొగుడుతాయి. ప్రమాణ గ్రంథాల వరుసలో ముందు వేదాలు, తరువాత స్మృతులు, అపైన పురాణాలని మరిచి పోవద్దు. ఇట్లా ఎక్కువ తక్కువల నెందుకు చూపించినట్లు? తమ ఇష్టదైవాలపై భక్తులకు ఏకాగ్రత కల్గించడం కోసమే. కనుక విడివిడిగా మనం వారిని చూడకూడదు.


విష్ణువు, కృష్ణునిగా వచ్చినా సంహారమూ చేసాడు, జ్ఞానోపదేశమూ చేసాడు. మిగిలిన అవతారాలలో ప్రధానంగా సంహారమూర్తియైనా ఈ అవతారంలో జ్ఞానోపదేశం చేయడం ప్రత్యేకత.


అర్జునునకు విశ్వరూప సందర్శనంలో "వందదామి తేచుక్షుః పశ్యమే యోగమైశ్వరం" (11.8)


అనగా నేను నీకు దివ్య దృష్టినిస్తున్నా. నా ఈశ్వరీయ సామర్ధ్యాన్ని చూడుమని అన్నాడు. ఇక్కడ ఈశ్వరుడనేమాట వేదాంతంలో చెప్పే సగుణ బ్రహ్మమా? లేక పరమేశ్వరుని ఈశ్వరుడనడమా?

No comments:

Post a Comment