Thursday 5 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 61 వ భాగం



ఇక అవతారం, గురు రూపంలో ఉండాలి. అసలు, పరమాత్మయే గురువు. ఉపనిషత్తు, అతణ్ణి గురువని చెప్పింది. అతనికి నమస్కరించుట, శరణు జొచ్చుట చెప్పబడింది. బ్రహ్మయే వేదాలనిచ్చాడు. ఆ మంత్రాలతోనే సృష్టి కార్యక్రమం మొదలౌతుంది. బ్రహ్మ విద్య నందించువాడు కూడా అతడే. అతణ్ణి పరమాత్మ సృష్టించి అతనికి వేదాలనందించాడు. ముముక్షువైన నేను అతనికి శరణు జొచ్చుతున్నానని మంత్రం:


"యో బ్రహ్మాణం విదధాతి పూర్వం 

యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై 

తం (గ్0) హ దేవం అత్మబుద్ధి ప్రకాశం  

ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే"


-శ్వేతాశ్వతరం (6-18)


ఇందే మరొకచోట పరమ గురువు శివరూపంలో ఉన్నాడని ఉంది. మహర్షి రుద్రుడు. వేదాలను పఠించే బ్రహ్మజననం కోసం చూస్తున్నాడని (అనగా హిరణ్యగర్భుని కోసం) ఉంది. మరొక చోట అతడే బ్రహ్మను సృష్టించాడని చెప్పబడింది. మహర్షి అనడం వల్ల ఉపదేశించు ఆచార్యుడే. రెంటిలోనూ మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ప్రార్ధన. పరమ మంగళ కరమైనదే బ్రహ్మము. దానిని చింతించువానికి అది వరప్రదాయిని అని శ్లోకార్ధం.


"అతి కల్యాణ రూపత్వాత్ నిత్య కల్యాణ సంశ్రయాత్ స్మరౄణాం వరదత్వాచ్చ బ్రహ్మ, తం మంగలం విదుః"


స్మరించేవారికి ఎట్టి వరమది? జ్ఞానమే వరఫలము. దీనినిచ్చునది శివమే. అతడిచ్చు జ్ఞానమూ శివమే. శంకరులే దాని స్వరూపము. ఆయనే శివం, కల్యాణం, శుభం. శివమే ఆచార్య శివమైంది.


No comments:

Post a Comment