Wednesday 11 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 67 వ భాగం



జీవులపై దయ చూపించి దక్షిణామూర్తి శంకరులుగా అవతరించాడంటే 'అతడూ మనస్సుతో ఈ పని చేసాడా? అయితే అతణ్ని ఆత్మయని, అఖండానందం అనుభవిస్తున్నాడని, ఎట్లా క్రియారహిత్వం ప్రాప్తించిందని శంక కల్గుతోంది.


ఈశ్వరుడు మాయతో ఉన్నా జ్ఞానియే


అతడు మాయతో ఉన్నా తానాత్మరూపుడనే ఎఱుక, ఎల్లవేళలా ఉంటుంది. మాయ అతని ఆధీనంలో ఉంటుంది. అదే మన ఆత్మను తెలిసి కోకుండా చేస్తుంది. అట్టి మాయ, ఈశ్వరుణ్ణి ఏమీ చేయలేదు. యోగి కొన్ని వస్తువులను సృష్టించినా, గారడీవాడు కొన్నింటిని చూపించినా వాటిని వారు నిజమని నమ్మరు. చూసినవారు నమ్ముతారు. అట్లాగే దక్షిణామూర్తి జగన్నాటకాన్ని ఆడుతున్నాడని శంకరులన్నారు.


"మాయావీవ విజృంభ యత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే"


అతడు మాయతో ఉన్న ఈశ్వరుడెట్లా జ్ఞాని అవుతాడని శంక. ఈశ్వరుడవడం వల్లనే అని సమాధానం. మనమట్టి స్థితిలో లేనంత మాత్రంచే అతడూ అట్లా ఉండలేడని భావించడం తప్పు. మన మాదిరిగానే ఈశ్వరుడుండాలా? అతడే కదా జ్ఞానులను, అజ్ఞానులను సృష్టించింది? రెండు రూపాలూ ఒకటై ఎందుకుండలేడు?


No comments:

Post a Comment