Friday 13 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 69 వ భాగం



అందుకే శంకరులు, ముందు కర్మలను అనుసరించండని మొదటగా ఉపదేశించారు. దానితో ఈశ్వరుని భజించండని అన్నారు.


"తేనేశస్య విధీయతాం అపచితిః" అపుడు కర్మ యోగమై కర్మ ఫలాల పట్ల కోరిక పోతుంది. ఫలాలనపేక్షించకుండా కర్మలను చేయాలన్నారు. "కామ్యే మతిః త్యజ్యతాం" అట్లా ఉంటే సత్సంగం చేయాలన్నారు "సంగః సత్సు విధీయతాం". చివరకు మనస్సునకు పరిపక్వత వస్తుంది. నివృత్తి మార్గంలో అడుగు పెడతాడు. గురువును సమీపించి ప్రణవోపదేశాన్ని, మహావాక్యాలను వింటాడు. జీవబ్రహ్మైక్యం సిద్ధిస్తుందని మార్గాన్ని విశదీకరించారు శంకరులు. ఇదే మాట శ్లోకంలో


"సద్విద్వాన్ ఉపసర్వ్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం


బ్రహ్మైకాక్షర మర్థ్యతాం ప్రతి శిరోవాక్య మాకర్ణ్యతాం" బ్రహ్మాస్మీతి విభావ్యతాం=నేను బ్రహ్మనని భావించు. "పరబ్రహ్మాత్మనా స్త్రీయతాం" అపుడు బ్రహ్మయైపోతావు. "ఏకాంతే సుఖ మాస్యతాం... పూర్ణాత్మా సుసమీక్ష్యతాం" అపుడేకాంత స్థితి, క్రియారహిత స్థితి వస్తుంది.


చెడుతో కలవని మంచి ఉండదు


ఏ పనియైనా తనకోసం కాకుండా ఇతరుల మంచికై పూర్తిగా ఉంటుందా? ఉండదు. ఏ పని చేసినా కొంత చెడు ఉంటుంది. మంచిలో ఇతరులకూ కొంత హాని జరగడమూ ఉంటుంది.


మంచికై కర్మయోగాన్ని అవలంబించి యుద్ధం చేయమని కృష్ణుడనలేదా? అయితే యుద్ధం వల్ల అంతా మంచే జరిగిందా? ఎందరో వీరులు నేలకొరిగారు. వారిలో అభిమన్యుడూ ఉన్నాడు. దీనివల్ల లోక కల్యాణం జరిగిందా అని శంకిస్తాం. కర్ణుడు తనవాడే అని తెలిసికొన్న తరువాత ఇదంతా నావల్లనే జరిగిందని ధర్మరాజు వాపోయాడు. ద్రౌపది పిల్లలను అందరినీ పోగొట్టుకొనవలసి వచ్చింది.


No comments:

Post a Comment