Friday 6 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 62 వ భాగం



(అనగా హిరణ్యగర్భుని కోసం) ఉంది. మరొక చోట అతడే బ్రహ్మను సృష్టించాడని చెప్పబడింది. మహర్షి అనడం వల్ల ఉపదేశించు ఆచార్యుడే. రెంటిలోనూ మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ప్రార్ధన. పరమ మంగళ కరమైనదే బ్రహ్మము. దానిని చింతించువానికి అది వరప్రదాయిని అని


"అతి కల్యాణ రూపత్వాత్ నిత్య కల్యాణ సంశ్రయాత్ స్మరౄణాం వరదత్వాచ్చ బ్రహ్మ, తం మంగలం విదుః"


స్మరించేవారికి ఎట్టి వరమది? జ్ఞానమే వరఫలము. దీనినిచ్చునది శివమే. అతడిచ్చు జ్ఞానమూ శివమే. శంకరులే దాని స్వరూపము. ఆయనే శివం, కల్యాణం, శుభం. శివమే ఆచార్య శివమైంది.


ఈ అవతారానికి తల్లిదండ్రులెవరు? ఎక్కడ?


అవతారానికి ఉపక్రమం


పోలీసు స్టేషన్లో ఎవరైనా దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేస్తే తగు చర్య తీసుకుంటారు. అట్లాగే అవతరించడానికి తగిన కారణం కోసం భగవానుడు ఎదురు చూస్తున్నాడు. ధర్మం క్షీణిస్తోందని దేవతలు, ఆర్జీ పెడితే భగవానుడవతరిస్తాడు. అంతేకాదు అవతారానికి జన్మనిచ్చే దంపతులు తమకు మంచి సంతానం కావాలని అనాలి. ఏదీ లేకుండా అవతరిస్తాడా?


ఇట్లా రెండువైపులా ఆర్జీ ఉంటుంది. ఇట్టిది రామకృష్ణావతారాలలో చూసాం. ముందు దేవతల ఫిర్యాదు. దశరథుడు పుత్రకామేష్టి చేయుట. తరువాత రామావతారం. సుతపస్ అనే ప్రజాపతి, అతని భార్య పృశ్ని చాలాకాలం పాటు తపస్సు చేసారని భగవానుడే మూడు జన్మలలో అవతరిస్తాడని ఉంది. అందు కృష్ణావతారం చివరది. దేవకీ వసుదేవుల బిడ్డడై జన్మించాడు. అంతకుముందు అదితి కశ్యపులకు వామనునిగా పుట్టాడు. విష్ణువు విషయంలో అట్టి ఆర్జీలుంటే శివుని విషయంలో ఉండవద్దా?


అతనికి లాంఛనాలతో పనిలేదు. అతనిలో ఉన్నది దయయే.


No comments:

Post a Comment