Saturday 14 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 70 వ భాగం



సేవలో కూడా కొందరికి అపకారం


మంచి చేద్దామని అనుకున్నా అనుకోకుండా కొంత హాని జరుగుతూ ఉంటుంది.


మిల్లు బట్టలు విదేశాలనుండి వచ్చేవి. మిల్లు బట్టలను విడిచి ఖాదీని ప్రోత్సహించండని గాంధీగారన్నారు. దానితో విదేశీ వస్తు బహిష్కరణతో బాటు స్వదేశీ వస్తువుల ప్రోత్సాహము రెండూ సిద్ధించాయి.


1922 లో రామేశ్వరానికి యాత్రకై వెళ్ళినపుడు మఠంలో ఉన్నవారందరూ ఖాదీని ప్రోత్సహించాలని అన్నాను. ఆనాడు విదేశీ వస్త్రాలను తగుల బెడుతూ ఉంటే బాధ కలిగి తగులబెట్టే బదులు వీటిని సముద్రంలో పడవెయ్యమని, ఖాదీని ధరించండని అన్నాను. ధనుష్కోటిలో వాటిని సముద్రంలో పడవేశారు. మదురై నుండి ఖాదీ బట్టలు వచ్చాయి. స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించడం వల్ల కుటీర పరిశ్రమలు వృద్ధి పొందాయి. దేశాభిమానం తొంగి చూసింది. బాగానే ఉంది.


లాంక్లైర్, మాంచెస్టర్లో నున్న మిల్లు యజమానులు గగ్గోలు పెట్టారు. వారి దేశంలో బొగ్గు, సున్నం తప్ప ఏమీ దొరకవు. అందువల్ల పరిశ్రమలు స్థాపించారు. విదేశాల నుండి ప్రత్తిని దిగుమతి చేసుకొని బట్టలను తయారు చేసి ఎగుమతి చేసుకొని బట్టలను తయారు చేసి ఎగుమతి చేస్తూ ఉండేవారు. కనుక వీరి నడవడికను తప్పు పట్టలేం. మిగిలిన దేశాలలోని చేనేత కార్మికులూ బ్రతకాలి కనుక కొన్ని రకాల బట్టలకే వారి వ్యాపారం పరిమితమైతే బాగుండుననిపించింది. అప్పుడు వారూ బ్రతుకుతారు కదా! ఇండియా, చైనా వంటి దేశాలు స్వదేశీ వస్తువులను ఉత్పత్తి చేసి తప్పనిసరి పరిస్థితులలో కొన్నిటినే విదేశాలనుండి దిగుమతి చేసుకుంటే బాగుండుననిపించింది. అయితే వ్యాపారమే వృత్తిగా గల ఇతర దేశాలవారు, మనం కేవలం స్వదేశీనే ప్రోత్సహిస్తే బాధపడరా అనిపించింది. అందువల్ల నా అంతట నేను భాదీనే వాడుతూ ఇతరులకు దీనే వాడండని ఉపదేశం చేయలేదు.


No comments:

Post a Comment