Sunday 1 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 58 వ భాగం



పరమ శివునకు ఎన్నో పేర్లున్నాయి. వేదంలో సమస్త విద్యలకు అతడధిపతి యని, అతడే సమస్త ప్రాణులకు ప్రభువని చెప్పబడింది. "ఈశానః సర్వవిద్యానాం..." అనే మంత్రంలో. సదాశివుణ్ణి ఓంకారంగా చెప్పి అదే ఆత్మస్వరూపమని చెప్పి చివరగా అట్టి మంగలమూర్తియైన శివుడు మాకు అనుకూలుడగు గాక అని యుంది. ఆ పై మంత్రమే గీతలోనూ చెప్పబడింది.


అట్టి విద్యాధినాథుడు, శంకరులై ఉపదేశ గురువు కావద్దా? 


తంత్ర గ్రంథాలలో పరమేశ్వరుడే అమ్మవారికి ఉపదేశించినట్లు ఉంటుంది.


అద్వైత విద్య అన్ని విద్యలకంటే అధికం. అది ఒక పుస్తకం కాదు, మంత్రం కాదు. అనుభవంతో కూడిన విద్య. అట్టి అద్వైతవిద్యయే శివుడు. 'అహం బ్రహ్మాస్మి' అన్నట్లుగా 'శివోహం' అని అంటారు. కేవలం ఈ మూడు అక్షరాలపై ధ్యానం చేయవచ్చు. మాండూక్యోపనిషత్తులో కూడా 'శివం అద్వైతం' అని యుంటుంది. కనుక అద్వైతాచార్య రూపంలోనే అవతరించడం సబబు. అమర కోశంలో పరమేశ్వరుణ్ణి సర్వజ్ఞుడని యుంది.


ఆపైన ప్రశ్నోత్తర మాలికలో ఎవరు జగద్గురువని ప్రశ్న. "కోహి జగద్గురు రుక్తః?" చటుక్కున మనం ఆదిశంకరులని అంటాం. అంతకు ముందే కృష్ణునకు జగద్గురు పదం ఉంది. కాని శంకరులు "శంభుః" అని సమాధానం చెప్పారు. ఆ శంభువే శంకరుడు. జ్ఞానం ఎవని వల్ల వస్తుందని ప్రశ్న. "జ్ఞానం కుతః?" శివుని నుండే అని జవాబు. "శివాదేవ"


కనుక జ్ఞానావతారం, పరమశివుడే కావాలి. ఇంతకుముందు వచ్చినవి విష్ణ్వతారాలు. కలిలో పరమేశ్వరుడవతరించాలి. వారే శంకరులు.


No comments:

Post a Comment