Friday 2 December 2022

భేతాళ కథలు - 4



“ఈమె నాకు భార్య అయినచో.. కొంతకాలం కాపరం చేశాక నా శిరమును నీకు బలి యిచ్చుకుంటాను.. " అని ఆలయంలోని కాళికి మొక్కుకుని... దేవీపూజలు చేసి ఆమెను వెంటాడి, ఆమె యింటి గుర్తులు చూసుకుని... తానే పనిమీద బయలుదేరాడో అది మరచిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతియందు ప్రేమతో రోజురోజుకీ కృశించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిని చూసి ఆయోమయంలో పడిపోయారు. ధవళుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటమూ, భయమూ ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు. సంగతేమిటని అడిగారు. అతను కూడా ఏదీ దాచుకోకుండా జరిగినదంతా చెప్పాడు. అతను యిచ్చిన గురుతులనిబట్టి శోభావతీపురానికి వచ్చి కనుక్కోగా - ఆమెది కూడా వారి కులమే అని తెలిసింది. అందుకు వాళ్లెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకుని .


“మా కొడుకు మీ అమ్మాయియందు మనసుని లగ్నం చేసుకున్నాడు. ఆమె అతనికెంతో యిష్టము. మా బిడ్డకు మీ పుత్రిక నిత్తురా?” అని అడిగాడు. “తప్పకుండా. మాకంగీకారమే” చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు ఇంకేం?


కొద్దిరోజులలోనే ధవళుడికీ ఆమెకీ వివాహం జరిగిపోయింది. తరువాత ధవళుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు.


కొంతకాలం గడిచింది. అప్పుడు ధవళుడి బావమరిది వచ్చాడు. అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ. "బావా! నిన్నూ మా సోదరినీ మా తల్లితండ్రులు యింటికి తీసుకురమ్మన్నారు. మీ తల్లితండ్రుల అనుమతి పొందాను. ఇక నీదే ఆలస్యం" అన్నాడు.


ధవళుడు అభ్యంతరం చెప్పలేదు. భార్యని తీసుకుని బావమరదితో తన అత్తవారింటికి బయలుదేరాడు.


వారు ముగ్గురూ ప్రయాణం చేసి చేసి శోభావతి నగర పొలిమేరలు చేరారు. అలసివున్న వారు కాళికాలయం.. కోనేరు... చూసేసరికి ధవళుడికి గతం గుర్తుకొచ్చింది. దేవికి తాను మొక్కిన మొక్కు మనసులో మెదిలింది. అంతే భార్యకుకాని బావమరదికి కాని చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్లి తన శిరసును కాళికి బలియిచ్చాడు.


బావ ఏమయ్యాడో తెలియకు - "వెదికి వస్తాను ” అని బయలుదేరాడు బావమరిది. ఆ ప్రాంతమంతా తిరిగి అతను చివరకి ఆలయంలోకి వచ్చాడు. తల తెగి పడివున్న బావని చూశాడు. అతనికేమీ తోచలేదు. తను కూడా తలనరుక్కుని బావగారి పక్కనే పడిపోయాడు.


తన సోదరుడు - బావని వెదకడానికి వెళ్లినవాడు కూడా ఎంతకీ రాకపోవడంతో వారిద్దరినీ వెదకడానికి ఆమె బయలుదేరింది. వెదకి వెదకి వేసారి చివరకామె కాళికాలయానికి చేరింది. అక్కడ -


తన భర్తదీ, సోదరుడిదీ - తలలు. వాటిపక్కనే వారి మొండెములు కనిపించాయి. ఆమెకు భయము వేసింది, విపరీతమయిన దుఃఖమూ, వైరాగ్యమూ కూడా కలిగాయి. అ భీభత్సదృశ్యాన్ని చూసేసరికి ఏడుపు ఆపుకోలేకపోయింది. - ఆమె


No comments:

Post a Comment