Sunday 4 December 2022

భేతాళ కథలు - 6



ఎవరు గొప్ప? 


"విక్రమారా! పూర్వం మల్లికాపురమనే నగరం ఉండేది. దానిని శకటశృంగుడనే రాజు పాలించేవాడు. అతని వద్ద కార్పాటకుడనే సేవకుండేవాడు. కార్పాటకుడత్యంత విశ్వాసపాత్రుడయిన సేవకుడు. అతను రాజునొక్క నిముషమయినా విడచి పెట్టేవాడు కాదు. రాజుని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు.


ఒకనాడు రాజు వేటకి బయలుదేరాడు. రాజుతోపాటు పరివారం కూడా బయలుదేరింది. రాజు అరణ్యంలో అనేక జంతువులని వేటాడాడు. అంతలో అతనికొక అడవిపంది కనిపించింది. దాని నెలాగైనా వేటాడాలనుకుని వెంటపడ్డాడు రాజు.


ఆ అడవిపంది టక్కరిది. రాజుకి కనపడినట్లే కనపడుతూ, దొరక్కుండా చాలా దూరం తీసుకుపోయింది. కార్పాటకుడు మాత్రం అతి కష్టంమీద ప్రభువుననుసరిస్తున్నాడు. అడవిలో చాలా దూరం రాజుని తన వెంట పరుగెత్తించి - అడవి పంది మరి అతనికి కనపడకుండా పోయింది. రాజక్కడ ఆగిపోవలసి వచ్చింది.


అది, నిర్మానుష్యమైన ప్రదేశం. కనుచూపుమేర మానవుడన్నవాడు కనిపించడంలేదు. రాజేమో చాలా అలసిపోయి ఉన్నాడు. అతనికెంతో దాహంగా ఉంది. ఉస్సు ఉస్సు అంటూ ఓ చెట్టుకింద కూర్చుండిపోయాడు. ఏం చేయాలో తోచక.


సరిగ్గా అప్పుడు - 


కార్పాటకుడతని ఎదుట దేవుడిలాగే ప్రత్యక్షమయ్యాడు. ఊరికే ప్రత్యక్షం కావడమే కాక రెండు ఉసిరికాయలనందించాడు. రాజు ఆత్రంగా వాటిని తిన్నాడు. అతని దాహం తీరింది. శరీరంలోకి కొంచెం శక్తీ, ఉత్సాహమూ చేరాయి. సేవకుడయిన కార్పాటకుడి భక్తివిశ్వాసాల కతనెంతో సంతోషించాడు. అడవిపంది మరికనపడదని తేల్చుకుని తన పట్నానికి బయలుదేరిపోయాడు.


కొన్నాళ్లు గడిచాయి -


ఒకరోజు - శకటశృంగ మహారాజు కార్పాటకుడిని తన దగ్గరగా పిలిచాడు. “కార్పాటకా! నువ్వు స్వామిభక్తి పరాయణుడివి. అందుచేత నా మనసులోని కోరికను నీకే చెబుతున్నాను. నువ్వే నా కోరికని సాధించగలిగే సమర్థుడివి. అందుకని నిన్నే యీ పనికి నియమిస్తున్నాను.” అన్నాడు.


“ఆజ్ఞాపించండి ” అన్నాడు కార్పాటకుడు వినయ విధేయతలతో.


No comments:

Post a Comment