Thursday 21 September 2023

శ్రీదత్త పురాణము (264)

 

చేటలగాలి ప్రేతధూమం శూద్రాన్నం వృషలీపతితో స్నేహం - ఇవ్వి ఎంతమాత్రం పనికిరావు. తలంటుపోసుకున్నాక మిగిలిన నూనెను ఒంటికి పులుముకోకూడదు. (శిరోభ్యంగా వశిష్టేన నాంగం న వేపమేత్). అశుచిగా ఉండి తాంబూలం వెయ్యరాదు. నిద్రించేవాణ్ని అనవసరంగా లేపకూడదు. అపరిశుద్ధుడై అగ్నికార్యంగానీ మజ్జిగగానీ కుడిచెయ్యి స్పర్శ లేకుండా ఒక్క ఎడమ చేతితోనే తాగరాదు. గురువుగారి నీడనూ ఆజ్ఞనూ అతిక్రమించకూడదు. (నచాక్రమేత్ గురో: చాయాం తదాజ్ఞాం చ మునీశ్వరాః), యోగి-విప్ర-యతి-వ్రతులను నిందించకూడదు. బ్రాహ్మణులు ఒకరి మర్మాలను మరొకరు చెప్పుకోకూడదు. ఎవరికీ చెప్పకూడదు. (పరస్పర మర్మాణి కదాచిన్న పదేత్ ద్విజాః), దర్శ పౌర్ణ మాసయాగాలను యథావిధిగా చెయ్యాలి. సాయంప్రాతరౌపాసాలను మానకూడదు. ఔపాసన మానితే సురాపానం చేసిన దోషం అంటుకుంటుంది. రెండు అయనాలతో విషువత్పుణ్య సమయాల్లో నాలుగు యుగాదుల్లో, మన్వాదుల్లో, అష్టకాల్లో, దర్శంతో ప్రేతపక్షంలో (మహాలయం) తిదినాడూ కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు శ్రోత్రియుడు అతిథిగా వచ్చినప్పుడూ సూర్యచంద్రగ్రహణ సమయాల్లో పుణ్యక్షేత్రాల్లో తీర్థాల్లో తప్పకుండా పితృదేవతలకు శ్రాద్ధవిధులు ఆచరించాలి. ఊర్ద్వ పుండ్రాలు ధరించకుండా చేసిన యజ్ఞం, దానం, తపస్సు, హోమం, స్వాధ్యాయం, పితృతర్పణం వృధా అవుతుందని కొందరి అభిప్రాయం. మరికొందరు ఊర్ధ్వపుండ్రానీ తులసినీ శ్రాద్ధ విధుల్లో అంగీకరించకూడదు. కాబట్టి శ్రేయోభిలాషులు వృద్ధాచారం ఏమిటో తెలుసుకొని దాన్ని పాటించటం మంచిది. స్మృతులు చెబుతున్న ఇలాంటి సదాచారాలను అందరూ తప్పకుండా పాటించాలి. సదాచారపరులను విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. విష్ణువే ప్రసమ్ముడైతే అసాధ్యమేముందిక


శౌనకాదిమునులారా! దత్తాత్రేయుడు ధర్మకీర్తికి బోధించిన వర్ణాశ్రమ ధర్మాలను భద్రశీలుడు (కిందటి జన్మలో ధర్మకీర్తి) తన తండ్రి గాలవుడికి చెబుతున్నట్టుగా నారదుడు సనత్కుమారుడికి ఉపదేశించగా వాటిని వేదధర్ముడు తన శిష్యుడు దీపకుడికి వివరిస్తున్నాడు. మొత్తం ఇదంతా బ్రహ్మదేవుడు కలిపురుషుడి సందేహాలను తీరుస్తున్న ఘట్టం. దత్తదేవుడి ఆజ్ఞతో నేను మీరు చెబుతున్నాను. స్వామివారు ధర్మకీర్తికి చెప్పిన శౌచసదాచారాలు మరికొన్ని ఉన్నాయి. ఆలకించండి.


No comments:

Post a Comment