Tuesday 26 September 2023

శ్రీదత్త పురాణము (269)

 


ఉపనిషత్తులను పఠిస్తూ వేదాంతార్థాలను యోచన చెయ్యాలి. జితేంద్రియుడై సుగతి తత్పరుడై ఎల్లవేళలా సహస్రశీర్షుడైన ఆ పరమాత్మను ధ్యానించాలి. అప్పుడే కోరుకున్న ముక్తిని పొందగల్గుతాడు. ధర్మకీర్తి! బ్రహ్మచర్యం మొదలుకొని సన్యాసం వరకు ఒక్కొక్క ఆశ్రమాన్నీ గడుస్తూ వచ్చిన ద్విజుడు దుఃఖరహితుడై పునర్జన్మలేని ముక్తి పొందుతాడు.


కుమారా! దత్తాత్రేయుడు క్రిందటి జన్మలో నీకు చాలా రహస్యాలు బోధించాడు. ధన్యుడవయ్యావు. వాటిని నాకు వివరించినన్నూ ధన్యుణ్ని చేసావు. సంతోషం ఇంకా ఏమైనా చెప్పేవి వుంటే అవి కూడా నాకు వివరించు- అని తండ్రి గాలవుడు కోరాడు. అప్పుడు తనయుడైన భద్రశీలుడు గత జన్మలో ధర్మకీర్తిగా తానున్నప్పుడు దత్తదేవుడు తెలియపరచిన శ్రాద్ధ విధులను కూడా తండ్రికి వినిపించాడు. సనత్కుమారా! వాటిని సైతం ఆలకించు అని నారదుడు ఇలా కొనసాగించాడు.


శౌనకాది మునులారా! దీపక వేదధర్మ సంభాషణగా సాగుతున్న కలి-బ్రహ్మ సంవాదం వింటున్నారుగా స్రాద్ధ విధులు ఆలకించండి అని సూతుడు అందుకున్నాడు.


శ్రాద్ధ విధులు


శ్రాద్ధ కర్త క్షయావహానికి (తద్దినానికి) ముందు రోజు రాత్రి భోజనం చెయ్యకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మర్నాటి శ్రాద్ధకర్మకు అవసరమైన బ్రాహ్మణుల్ని ఆ రోజే నియంత్రించుకోవాలి. ఆ రాత్రికి నేల మీదనే పరుండాలి. తద్దినం నాడు తత్కర్తలు దంతధావన - తాంబూల - తైలాభ్యంగ స్నాన - రతి - ఔషధీ పరాన్న భోజనాలను వర్జించాలి.


No comments:

Post a Comment