Saturday 2 September 2023

శ్రీదత్త పురాణము (275)

 


అశాశ్వతమైన ఈ శరీరంమీద ధీమంతులెవ్వరూ అట్టే నమ్మకం పెట్టుకోరు. నిత్యం సన్నిహితో మృత్యుః అన్నారు. సంపదలా అత్యంత చంచలాలు. ఆసన్నమరణోదేహః అంచేత ఎవ్వరికీ ఏ దర్పమూ పనికిరాదు. ఏ సంయోగానికైనా ముగింపు వియోగమే. అంతా క్షణభంగురం. ఇది ఎరిగి అందరూ అన్నివేళలా హరిభజన చెయ్యాలి. మహాయోగులకూ మహాతపస్వులకూ ధుర్లభమైన వైకుంఠ నివాసం విష్ణుమూర్తిని భక్తితో స్మరించిన వారికి అర్చించిన వారికి, అనాయాసంగా లభిస్తుంది. సందేహంలేదు. సర్వతీర్ధ సంసేవనం సర్వయజ్ఞ నిర్వహణం సాంగోపాంగ వేదాధ్యయనం- ఇవన్నీ నారాయాణార్చనలో పదహారవ కళకు సాటిరావు. అటువంటి విష్ణుభక్తి లేకపోయాక వేదశాస్త్రాలు అభ్యసించి ఏం లాభం ? తీర్థయాత్రలు చేసి ఏమి ప్రయోజనం ? తపస్సులెందుకూ ? యజ్ఞాలెందుకు ?


నైమిశేయులారా ! శౌనకాది మహామునులారా! నారదుడు సవత్కుమారుడికి దత్తాత్రేయ ధర్మకీర్తి సంవాదరూపంగా చెప్పిన ప్రాయశ్చిత్తవిధులు సంక్షేపంగా మీ చెవిని వేశాను. ఇంకా అనేక ధర్మాలూ సదాచారాలూ దత్తదేవుడు ధర్మకీర్తికి బోధించాడు. అతని నుంచి వాటిని విన్న గాలవుడు ధన్యుడు.


భజంతి యే విష్ణు మనంతమూర్తిమ్ నిరీహమోంకార గతం వరేణ్యమ్ ! 

వేదాంత వేద్యం భవరోగవైద్యమ్ చేయాంతి సర్వేపద మచ్యుతస్య !! అనాదిమాత్మాననువంతశక్తేమ్ ఆధారభూతం జగతాంపరేశమ్ ! 

జ్యోతిస్స్వరూపం పరమచ్యుతాఖ్యమ్ సంపూజ్యతే యాంతి పదం పవిత్రమ్ !!


No comments:

Post a Comment