Sunday 8 March 2015

హిందూ ధర్మం -149 (మహాభారతం అణుయుద్ధమా?)

మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రుకలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.

మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

ఇదికాక, మహాభారత యుద్ధం నాటి అణుబాంబుల రేడియో ధార్మికత ప్రభావం రాజస్థాన్ ప్రాంతంలో ఈనాటికి ఉంది. రేడియో ధార్మికత ప్రభావం కలిగిన బూడీ పొరలు జోధ్‌పూర్‌కు పశ్చిమంగా 10 మైళ్ళ దూరం లో 3 మైళ్ళ మేర విస్తరించి ఉంది. దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలు అంగవైకల్యాలతో పుట్టడం, క్యాన్సర్ బారిన పడడం గమనించారు. అక్కడున్న రేడియేషన్ స్థాయులు గమనించిన ప్రభుత్వం, ఆ ప్రాంతాన్ని నివాసయోగ్యం కానిదిగా భావించి, అక్కడ గృహనిర్మాణాలు చేపట్టలేదు.

ఆ ప్రదేశంలో శాస్త్రవేత్తలు ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు. దాని వయసు సుమారు 8,000 నుంచి 12,000 సంవత్సరాలుగా ఆత్యాధునిక పద్దతులలో పరిశోధించి నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతం భారీ అణువిస్పోటనానికి గురైందని, చాలా నిర్మాణాలు నాశమయ్యాయని, 5 లక్షలకు పైగా జనాభా ఆ బాంబు కారణంగా మరణించారని భావిస్తున్నారు. ఒక పరిశోధకుడి అంచనా ప్రకారం అక్కడ పడిన అణుబాంబు జపాన్‌లో పడిన అణుబాంబుకు సమానమైందని అంటున్నారు.

To be continued ...........................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
ఆంధ్రప్రభ 3 జనవరి 2015, శనివారం ప్రచురితమైన వ్యాసం.
http://higher-perspective.blogspot.in/2013/10/ancient-city-discovered-in-india.html

No comments:

Post a Comment