Sunday 15 March 2015

హిందూ ధర్మం -150 (మహాభారతం అణుయుద్ధమా?)

హిరొషిమా, నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగేవరకు ఇటువంటి భయంకరమైన మారణ అస్త్రాలు ఉంటాయని ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు భారతీయ ఇతిహాసాలను చదివిన పాశ్చాత్యులు వీటిని కేవలం కల్పనలుగానే భావించారు. కానీ జపాన్ పై దాడి తర్వాత ఆ భావన పూర్తిగా తొలగిపోయింది. అదికాక రేడియో ధార్మికత వలన మానవులకు ఎటువంటి అనారోగ్య ప్రభవాలు ఏర్పడతాయో కుడా భారతంలోనే ప్రస్తావించడం, అచ్చం అలానే జపాన్‌లో జరగడంతో పశ్చిమ దేశాలు ఒక్కసారి ఖంగుతిన్నాయి. అణుబాంబు నుంచి వెలువడిన రేడియేషన్ వలన గోళ్ళు ఊడిపోతాయి, వెంట్రుకలు రాలిపోతాయి, తాత్కాలికంగా నీటిలో మునిగి ఉపశమనం పొందినా, అది దీర్ఘకాలిక ఉపశమనాన్ని ఇవ్వలేదు. హరప్పా, మోహంజెదారొ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ చెల్లాచెదురూగా పడి ఉన్న 44 అస్తిపంజరాలను కనుగొన్నారు. వాటి స్థితిగతులను గమనించి, ఏదో భయాంకరమైన ఉపద్రవం సంభవిస్తే, తప్పించుకోడానికి ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని పరుగులు తీస్తున్న విధంగా ఉన్నాయి. ఇవి సాధారణ పురావస్తు పరిశోధనలు చేసినా, అవి వేల సంవత్సరాల నాటివని నిర్ధారణ చేశారు. ఈ తర్వాత అనేకానేక ప్రశ్నలు తలెత్తినా, హరప్ప నాగరికత అణుబాంబు వంటి ఒక మానవ ఉపద్రవం వలననే నశించిందని అనేకమంది శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.



ఇక్కడ దొరికిన అస్తిపంజరాలు అత్యంత రేడియో ధార్మికత కలిగి ఉన్నాయి. దాదాపు హిరోషిమా, నాగసాకిలో అణుబాంబు కారణంగా మరణించిన వారి అస్తిపంజరాలకంటే కూడా అధికం అని చెప్పవచ్చు. ఒక ప్రదేశంలో రష్యన్ పరిశోధకులు పరిశోధన జరుపగా, అక్కడ రేడియోధార్మికత సాధరణ స్థాయి కంటే 50 రెట్లు అధికంగా ఉంది. ఇదేగాక, ఉత్తరభారత దేశంలో భారి పేలుళ్ళ కారణంగా ద్వంసమైనవిగా భావిస్తున్న మరికొన్ని నగరాలు కనుగొన్నారు. అటువంటి ఒక నగరం గంగానదికి,  రాజ్‌మహల్ పర్వతాలకు మధ్య ఉన్నది. అది అత్యధిక ఉష్ణోగ్రతకు లోనైన ప్రదేశం అని చెప్తున్నారు. అక్కడే భారీ స్థాయిలో కట్టడాలు, పునాదులు ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. వాటికి కారణం అణుబాంబు విస్పోటనం కానీ, లేక అగ్నిపర్వతం బద్దలవ్వడం .......... రెండిటిలో ఏదో ఒకటి కావాలి. అక్కడ ఎటువంటి అగ్నిపర్వతం లేకపోవడం చేత, ఆయా నగరాలు అణుబాంబు కారణంగానే నశించాయని భావిస్తున్నారు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం గ్రహించాలి.  అణుబాంబు పితామహుడిగా ప్రపంచం ఓఫెనిహీమర్‌ను గుర్తించింది. ఒకసారి ఓఫెనిహీమర్ ఒక కాలేజీలో ప్రసంగానికి వెళ్ళినప్పుడు అక్కడున్న విద్యార్ధి ' లో జరిగిన అణుబాంబు పరీక్ష మొట్టమొదటిదనీ మీరు భావిస్తున్నార?' అని అడుగుతాడు. అంటే ఆ విద్యార్ధి ఉద్ద్యేశం ఇంతకముందు యు.ఎస్.లో ఎప్పుడైన అణుబాంబు పరీక్ష నిర్వహించారా అని. దానికి సమాధానంగా ఓఫెనిహీమర్ 'అవును, ఆధునిక కాలంలో ఇదే మొదటిదీ అని సమాధానం ఇస్తారు. (అనగా ఆధునిక కాలంలో ఇదే మొదటిది, ఇంతకముందు చాలా పూర్వం అనేకం జరిగాయని ఆయన నమ్మకం). ఓఫెనిహీమర్ హార్వర్డ్‌లో అండర్ గ్రాడుయేషన్ చేసారు. తర్వాత ఒక వ్యక్తి పరిచయం ద్వారా సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతంలో భగవద్గీతను చదివారు. అటు తర్వాత సనాతనధర్మానికి సంబంధించిన గ్రంధాల మీద ప్రత్యేక ఆసక్తి చూపించి, వాటిని అభ్యసించారు. తరుచూ ఆయన ప్రసంగాల్లో మహాభారతం, భగవద్గీత నుంచి శ్లోకాలు ప్రస్తావించేవారు. శివుడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడేవారు. మొదటి అణుబాంబు పరీక్షా సమయంలో కూడా ఓఫెనిహీమర్ భగవద్గీత నుంచి శ్లోకం గట్టిగా చదివి వినిపించారు. భారతీయులకు అణుబాంబుల గురించి జ్ఞానం వేల ఏళ్ళ క్రితమే తెలుసునని నమ్మినవారిలో ఒకరు ఓఫెనిహీమర్. ఈ విధంగా మహాభారతం అణుయుద్ధం అని చెప్పడానికి అనేకానేక పురావస్తు ఆధారాలతో పాటు అనేకమంది  పాశ్చ్యాతుల పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.

To be continued ...............

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు: http://www.worldwideashram.org/worldwideashram/2011/07/new-proofs-of-nuclear-war-in-ancient-india/

No comments:

Post a Comment