Saturday 6 November 2021

శ్రీ హనుమద్భాగవతము (68)



మనము అమరావతీపురము (స్వర్ఘము) లోని సుఖసామగ్రులతో కూడి ఉన్న ఈ గుహలోనే సుఖంగా ఉండగలము.

వానరులు మెల్లగా చెప్పిన మాటలు విని పరమనీతిజ్ఞుడైన పవననందనుడు యువరాజునకు ధైర్యము చెబుతూ ఎంతో ప్రేమతో ఇలా పలికాడు : 'యువరాజా ! నీవు వ్యర్థముగా ఎందుకు చింతిస్తున్నావు? నీవు మహారాణియైన తారకు ప్రాణప్రియ పుత్రుడవగుటవలన సుగ్రీవునకు కూడా సహజముగానే ఇష్టుడవై ఉన్నావు. నీయందు శ్రీ రాఘవేంద్రునకు ప్రేమ ప్రతి దినము లక్ష్మణుని పై కంటెను అధికమవుతున్నది. వానరులు నిన్నీ గుహలో నిష్కంటకముగా ఉండమని పలికారు. కాని అదివ్యర్థము. ఎందుకనగా ముల్లోకములలో ఏ లక్ష్యము కూడా శ్రీరాముని బాణములచే అభేద్యముకాదు. భార్యాపుత్రులను ఎప్పుడును ఎడబాయని ఈ వానరులు నీకు తగిన సలహా ఇవ్వడం లేదు”.


పవనపుత్రుడు ఎంతో ప్రేమతో అంగదునకు నచ్చ చెబుతూ ఇంకా ఇలా పలికాడు :- "కుమారా ! ఇంతేకాదు నేను నీకొకరహస్యాన్ని చెబుతున్నాను. శ్రద్ధగా వినుము. శ్రీరామచంద్రుడు సామాన్యమానవుడు కాడు. ఆయన సాక్షాత్తుగా నిర్వికారుడైన శ్రీనారాయణుడు. సీతా దేవి జగన్మోహినియైన మాయ. లక్ష్మణుడు త్రిభువనధారుడైన సాక్షాత్తు ఆది శేషువే. వారందఱు 'బ్రహ్మదేవుని ప్రార్థనను అనుసరించి రాక్షస వినాశమునకై మాయామానవరూపమున జన్మించారు. ఒక్కొక్కరు ముల్లోకములను రక్షింపసమర్థులు. 


అన్యద్గుహ్యతమం వశేష్యే రహస్యం శ్రుణు మే సుత| 

రామో న మానుషో దేవః సాక్షాన్నారాయణేఽవ్యయః || 

సీతా భగవతీ మాయా జనసమ్మోహకారిణీ | 

లక్ష్మణో భువనాధారః సాక్షాచ్ఛేషః ఫణీశ్వరః ||

బ్రాహ్మణా ప్రార్థితాస్సర్వే రహోగణవినాశనే | 

మాయామానుషభావేన జాతా లోకైకరక్షకాః ||


(వా. రా. 4–7–16-18) 


మనము పరమప్రభువు లీలా కార్యంలో కారణంగా ఉండటమే అదృష్టం.


No comments:

Post a Comment