Thursday 18 November 2021

శ్రీ హనుమద్భాగవతము (79)



మైనాకుడు ఎంతో ఆదరముతోను ప్రేమతోనూ “వాయునందనా ! నీతో నాకీ పవిత్రసంబంధమున్నది. నీవు నాకు మాననీయుడవు. అంతేకాదు సముద్రుడు కూడా నీకు విశ్రాంతిని ఒసంగమని నన్ను ఆజ్ఞాపించినాడు. నీవు నాయందు గల వివిధములైన మధుర ఫలములను భుజించు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకో. పిమ్మట నీపనికై వెళ్ళు” అని హనుమంతునితో పలికాడు.


మైనాకుని మాటలు విని ఆంజనేయుడు ఎంతో ప్రేమతో “మైనాకా! నిన్ను కలుసు కొనుటవలన నాకు సంతోషము కలిగినది. నా ఆతిథ్యమైనది. నా స్వామి కార్యమునకై త్వరగా వెళుతున్నాను. అందువలన నేనిపుడు విశ్రమించుట అసంభవము" అని పలికాడు.


కేసరీనందనుడైన హనుమంతుడు నవ్వుతూ మైనాకుని స్పృశించి తీవ్ర వేగముతో ముందుకు వెళ్ళాడు. అప్పుడు శైలప్రవరుడైన మైనాకుడు, సముద్రుడు ఇరువురు అతని వైపు ఎంతో ఆదరముతోనూ, ప్రేమతోనూ చూసి అతనిని ఆశీర్వదించారు.


ఆంజనేయుడు శ్రీరామచంద్రుని కార్యమునకై వేగముగా లంక వైపు ఎగిరి వెళుతుండటం చూసి దేవతలు అతని బలమును బుద్ధిని పరీక్షింపదలచి నాగమాతయైన సురసను పంపారు. దేవతల ఆదేశమును అనుసరించి సురస వికటము, భయంకరమైన రూపమును ధరించాడు. దాని నేత్రములు పచ్చగాను, దవడలు భయంకరముగాను ఉన్నాయి. ఆమె ఆకాశమును స్పృశించునట్లు వికటతమమైన తన నోటిని తెరచి హనుమానుని మార్గమున నిలుచుంది.


హనుమంతుడు తన వైపు వచ్చుట చూచి నాగమాత ఇలా పలికాడు —— “బుద్ధిమంతుడా! నేను తీవ్రమైన ఆకలి బాధచే వ్యాకులపడుతున్నాను. దేవతలు నిన్ను నాకు ఆహారముగ పంపారు. నీవు నా నోటిలోనికి రమ్ము. నా ఆకలి బాధను శాంతపరచు.

No comments:

Post a Comment