Monday 22 November 2021

శ్రీ హనుమద్భాగవతము (83)



హనుమంతుడు మిక్కిలి సూక్ష్మరూపమును ధరించినా లంకకు హనుమంతుడు మిక్కిలి సూక్ష్మరూపమును ధరించినా లంకకు అధిష్ఠాత్రియైన లంకిణి అనే ఆమె ఆయనన్ చూసింది. అది ఆయనను గద్దించుచు “ఓరీ! నీవెవ్వడవు? దొంగవలె ఈ నగరములోనికి ప్రవేశించుచున్నావు. చావుటకు పూర్వము నీవు నీ రహస్యమును వెల్లడించు'మని పలికింది. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడిట్లా తలచాడు - ‘మొదటనే ఈ వ్యక్తితో వివాదపడటం మంచిది కాదు. రాక్షసులు ప్రోగైతే ఇచ్చటే యుద్ధము ప్రారంభమవుతుంది. సీతా మాతను కనుగొనుటలో అంతరాయమేర్పడుతుంది! వెంటనే ఆయన ఆ వ్యక్తిని స్త్రీగా భావించి తన కుడి చేయి పిడికిలితో మెల్లగా గొట్టాడు. వజ్రమయ దేహుడైన హనుమానుని పిడికిలి పోటుచే లంకిణి నేత్రములు బైరులు గ్రమ్మాయి. అది రక్తము క్రక్కుకొంటూ భూమిపై బడి మూర్ఛిల్లింది. కాని కొద్ది సమయములోనే ఆమె మూర్ఛ నుండి లేచి కూర్చున్నది. 


అప్పుడు లంకిణి వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతునితో 'శ్రీరామదూతవైన హనుమా! నీవు లంకాపట్టణముపై విజయము సాధించావు. పొమ్ము, నీకు శుభమగుగాక! సీతా దేవి కారణముగా దురాత్ముడైన రావణుని వినాశమునకు కాలము సమీపించినది. పూర్వము చతుర్ముఖుడైన బ్రహ్మ నాతో ఇలా పలికాడు. 'త్రేతాయుగమున సాక్షాత్తుగా క్షీరోదధిశాయీ, వినాశరహితుడైన నారాయణుడు దశరథకుమారుడైన శ్రీ రాముని రూపమున అవతరిస్తాడు, ఆయన భార్య, మహామాయారూపిణీ అయిన సీతా దేవిని రావణుడు హరించాడు. ఆమెను ఆన్వేషిస్తూ రాత్రివేళ ఒక్క వానరుడు లంకలోనికి ప్రవేశించాడు. వాని పిడికిలి పోటుచే నీవు కలత చెందుతావు. ఇక రాక్షసవంశమునకు చేటుమూడినదని నీవప్పుడు తెలిసికో! నా అదృష్టవలన సుదీర్ఘ కాలము తరువాత నేటికి నాకా భవాబ్ధిపోతయైన శ్రీ రాముని ప్రియ భక్తుని దుర్లభ సాంగత్యము లభించినది. నేడు నేను ధన్యురాలనైతిని. నా హృదయమున విరాజిల్లు దశరథనందనుడైన శ్రీరాముడు నాపై ఎల్లప్పుడు కృప చూపుగాక.”


తద్భక్తసంగోఽప్యతిదుర్ల భో మమ 

ప్రసీదతాం దాశరధిః సదా హృది ||


(అ.రా. 5–1–57) 

వాయునందనుడు మిక్కిలిసూక్ష్ము బుద్ధిమంతుడైన రూపమును ధరించి, కరుణామయుడైన భగవానుని మనస్సులో స్మరించుకొని అసురరక్షితము, దుర్భేద్యమైన లంకలోనికి ప్రవేశించాడు.

హనుమంతుని సముద్రోల్లంఘన లంకా ప్రవేశములతో పాటు జగజ్జననియైన జానకికి కుడిభుజము, లంకాధిపతియైన రావణునకు ఎడమకన్ను, సురవందితుడైన శ్రీ రామునకు ఎడమపార్శ్వము అదరినవి.


No comments:

Post a Comment