Saturday 8 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (15)



ఎంత బుద్ధిమంతుడైనా, ఎంతగా ఇంద్రియాలను జయించినా అంతకంటే అతడు రామభక్తునిగా, రామదాసుగా ప్రసిద్ధుడు. భక్తిమంతులలోనూ వరిష్ఠుడే. దూతకు అన్ని లక్షణాలూ ఉండాలి. అందుకే అప్పజెప్పిన పనిని ఆనందంతో నిర్వహించి సీతారాముల దుఃఖాన్ని పోగొట్టాడు. శ్రీ రామదూతం శిరసానమామి.


మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం 

వాతాత్మజం వానర యూధ ముఖ్యం 

శ్రీరామదూతం శిరసా నమామి


అంజనానందనుడు అజాడ్యాన్ని ప్రసాదించుగాక


బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతా 

అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్


ఎందుకు హనుమను ప్రార్థించాలో పై శ్లోకం వివరిస్తోంది. దేనికైనా ముందు బుద్ధి కావాలి కదా! బలమనగా శారీరక బలం కావాలి. తరువాత వచ్చేది కీర్తి. ధైర్యం నిర్భయత్వం = భయంలేకపోవుట. నిర్భయత్వంలోనే ధైర్యం ఇమిడియుంది. నిర్భయత్వమని విడిగా ఎందుకున్నారు? ధైర్యానికి చాలా అర్థాలున్నాయి. నిశ్చయం, శాంతమనస్కత, మొదలైనవి కూడా. ధైర్యంలోకి వస్తాయి. ఆంజనేయుణ్ణి కొలవడం వల్ల ధైర్యం వస్తుంది. ఇతరులితనిని చూసి భయపడకుండుట నిర్భయత్వం. అభయత్వం. ఇది సన్యాసి దీక్ష తీసికొనేటపుడు ఉంటుంది. అరోగతా = రోగం లేకపోవుట; అజాడ్యం = జడత్వం లేకపోవుట. వాక్పటుత్వం = బాగా మాట్లాడు నేర్పు. వాల్మీకి, కంబడు ఇతని వక్త్రృత్వాన్ని మెచ్చుకొన్నారు.


అనగా ఈ ఏడు కావాలి. మనకెవ్వరూ చెప్పకుండా మనం వీటిని కోరాలి. ఎనిమిదవది అజాడ్యం. శ్లోకంలో ఇది ఏడవది. దీనికై ఎందుకు ప్రార్థించాలి? పనులు చక్కబెట్టుకోవాలంటే జడత్వం పనికిరాదు. కనుక అజాడ్యమన్నారు. అంటే అర్థమేమిటి?


No comments:

Post a Comment