Saturday 29 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (5)



మూర్చిల్లిన కుమారునిగాంచి వాయుదేవుడు దుఃఖితుడైనాడు. తనయుని తినుకుని కొండగుహచేరి ఉపచరించుచు వాయుస్తంభన చేసినాడు. సకల చరాచర జంతుచయము ఊపిరాడక తల్లడిల్లింది. ఆ సన్నివేశాన్ని ఉత్తర రామాయణం ఇలా వర్ణించింది.    


చేసినాడు. సకల చరాచర జంతుచయము ఊపిరాడక తల్లడిల్లింది. ఆ సన్నివేశాన్ని ఉత్తర రామాయణం ఇలా వర్ణించింది.


యాజకుల్ వహ్ని హవ్యములు వ్రేల్వగ జూచు


హస్తముల్ సాచినయటుల నుండె


దివిజులు ప్రేరేస దివికెగిరిన దేవయాసంబు


లెగిరిన యటుల నుండె


మునులు నదీతోయముల దోగముంచిన


యంగములో ముంచిన యటుల నుండె


బశు మృగ నరముఖ ప్రాణు లుర్వినిబెట్టు


నడుగులు బెట్టిన యటుల నుండె


భానుమండల మొక్కచో బాదుకొనియె 

గాలగతిదప్పే సత్రియల్ గడచె వేద 

పాఠముడివోయె బాహ్యమభ్యంతరంబు

గాడ్పు బంధించి చనిన యక్కాలమందు.


ఇలా లోకాలన్నీ వాయు సంచారం లేక అల్లాడిపోసాగినవి. ఇంద్రాది దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. ఆ బ్రహ్మదేవుడును ఇంద్రుని తొందరపాటుకు మందలించి అందరిని తీసుకుని వాయు వున్న పర్వత గుహ చేరి చేష్టలుడిగిన బాలుని స్పృశించి చైతన్య వంతుని చేసినాడు. దేవతలందరితో "యీ బాలుడు సామాన్యుడు కాడు. దేవకార్య సిద్ధ్యర్థం జన్మించిన మహానుభావుడు. మీ మీ శక్తుల నీతనికి ప్రసాదించండి" అని పలికినాడు చతురాననుడు.


అంటూనే ముందుగా తానే "ఏ అస్త్రము వలనా మరణం లేని" వరం ఆంజనేయునకు ఇచ్చినాడు.


ఇంద్రుడు పశ్చాత్తప్తుడై స్వేచ్ఛా మరణాన్ని వరంగా ప్రసాదించగా, సూర్యుడు సకల శాస్త్ర విశారదునిగా చేస్తానన్నాడు. ఇలా దేవతలందరూ తమ తమ శక్తులను వరంగా అనుగ్రహించారు. సంతసించిన వాయుదేవుడు బంధించిన శీతల వాయువులతో ప్రాణి లోకంను ప్రాణవంతం చేశాడు, విరిగిన హనువు కలవాడగుట వలన ఆంజనేయుని నాటినుండి హనుమంతుడన్నారు.


No comments:

Post a Comment