Thursday 20 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (27)



రామ-హనుమల మధ్య ప్రభు-సేవకభావం భగవానుడు భక్తుల అనుబంధం ఉన్నట్లు అనుకొంటాం కదా! కాని చివరగా గురు-శిష్య సంబంధమూ ఉంది. సద్గురు - సత్ శిష్య సంబంధం కంటే మించినది లేదు. ఇతడు సత్పురుషుడు - రాముడు సచ్చిదానందరూపుడే. ఇట్లా గురుశిష్యులుగా భావించడమూ పుణ్యమే.


ఒక్క ప్రక్క రాముడు చక్రవర్తి. ధర్మప్రకారం పాలించినవాడు. మరొక ప్రక్క జ్ఞాన రాజు కూడా. ఆత్మోపదేశం ఇచ్చే జ్ఞానగురువు. జనకుడట్టివాడు. అతడు రాజు, రాజర్షి కూడా, రాజైవేదాంత చర్చలు చేసేవాడు.


రాముడు, ఆంజనేయునకే కాదు, ఋషులందరికీ ఉపదేశించాడు. రాముడు, నారాయణావతారమని ఋషులకు తెలుసు. రాక్షస సంహారం కోసం అవతరించాడనీ తెలుసు. ఆ పని పూర్తియై రాజ్యాన్ని ఏలుతున్నాడు. ధర్మం, ఆచరణలో ఉంటుందని ఆచరించి చూపిస్తున్నాడు. అదే అవతార లక్ష్యం. మూడవ పనిని చూడబోతున్నారు ఋషులు.


దేనికైనా పూర్వాంగం, ఉత్తరాంగం ఉంటుంది. ముందు చేయవలసినది పూర్వాంగం. తరువాత ఉత్తరాంగం. వైదిక సంప్రదాయంలో ధార్మిక కర్మలు చేసి నడవడికను తీర్చిదిద్దుకొని తరువాత బ్రహ్మమునకై విచారించాలి. ఆ బ్రహ్మము, ధర్మాధర్మములకతీతము. మనకున్న షట్ దర్శనాలలో పూర్వమీమాంస ఒకటి. ధర్మాన్ని తెలిసికోవాలని ధర్మజిజ్ఞాసతో మొదలౌతుంది. ఉత్తరమీమాంస బ్రహ్మ జిజ్ఞాసతో ఆరంభమౌతుంది. దానినే వేదాంతమంటారు. ఏయే వైదిక కర్మలు చేయాలో చెప్పేది పూర్వ మీమాంస. బ్రహ్మను తెలిసికొనుటకు సాధన సంపత్తిని, మార్గాన్ని చూపేది ఉత్తర మీమాంస.   


No comments:

Post a Comment