Thursday 1 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 178వ భాగం



త్రిమూర్తులకు మూడు శక్తులుగా ఉండగా నాల్గవ దానిని ఎందుకు పేర్కొన్నట్లు?


ప్రజలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి మొదలైన అష్టలక్ష్ములను అడుగుతారని శంకరులకు తెలుసు. డబ్బంటే లక్ష్మియే గుర్తుకు వస్తుంది. అయితే కేవలం, డబ్బును తింటారా? కనుక అన్నం ఇచ్చే శాకంభరిని పేర్కొన్నారు. తరువాత రుద్రుని శక్తిని శశిశేఖర వల్లభగా చంద్రుణ్ణి నెత్తిపై పెట్టుకున్న సంహారమూర్తియైనవాని భార్యను పేర్కొన్నారు. సంహారమూర్తియనగా మాయతో కూడిన మహేశ్వరుడే సదాశివుడై మోక్షాన్నిస్తాడు. అప్పుడతడు శశిశేఖరుడు. ఇప్పుడు శేఖర వల్లభయనగా ఆమె ప్రళయశక్తి. తిరోధాన శక్తి, అనుగ్రహ శక్తి. ముందుగా బ్రహ్మ శక్తియని చెప్పడం వల్ల, అట్లాగే విష్ణు శక్తియని చెప్పడం వల్ల పరబ్రహ్మ శక్తియే పంచ కృత్యాలకు మూలమని ఇట్లా రూపాంతరం చెందిందని చెప్పడం వల్ల అద్వైతాన్ని బోధించినట్లే.


చివరగా త్రిభువనైక గురోస్తరుణి అని ఉంది. అనగా మూడు భువనాలకు విష్ణువు గురువని, అతని భార్య లక్ష్మియని అర్థం. గురువు యొక్క శక్తి యనినప్పుడు డబ్బునీయడమే కాదు, ఆమె జ్ఞాన శక్తియని అర్థం. శంకరుల గురుపరంపరలో మొదటి నారాయణుని ప్రస్తావన ఉంటుంది. అందువల్ల త్రిభువనైక గురువని విష్ణువును నుతించారు. రామ, కృష్ణ అష్టోత్తర నామాలలో అట్లాగే శివస్తోత్రంలోనూ జగద్గురవేనమః అని యుంటుంది.


త్రిభువనైక గురువని చెప్పడంలో అతడు జ్ఞానోపదేశమే కాదు, మూడు భువనాల తండ్రియని అర్ధం. మూడు భువనాలకు తల్లి లక్ష్మి, లక్ష్మీ అష్టోత్తరంలో "బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః" అని చెప్పినట్లుగా ఉందన్నమాట.


తరువాతి శ్లోకంలో 

"శ్రుత్యై నమోస్తు శుభకర్మాఫల ప్రసూత్యై

రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 

శక్యై నమోస్తు శతపత్రనికే తనాయై

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై"


No comments:

Post a Comment