Monday 19 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 196 వ భాగం



మాధవీయ శంకర విజయంతో వీరికి నాల్గు మహావాక్యాల ఉపదేశం జరిగినట్లుంది. ఇట్టి ఆచారం, మా మఠంలోనూ ఉంది. సోఽహంలో ప్రణవం ఉంది. అది జీవబ్రహ్మల ఐకమత్యాన్ని చెబుతుంది కనుక సోఽహం కూడా మహాకావ్యమే.


బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాయవలసిందిగా శంకరులను గోవిందులా జ్ఞాపించారు. లోగడ పరమేశ్వరుడు దేవతలతో చెప్పాడు కదా! ఆ కాలం కోసం ఎదురు చూసారు.


శంకరులు భాష్యం వ్రాసి గోవిందులు చరణ సన్నిధిలో ఉంచారు. ఇది కాశిలో వ్రాసినట్లుంది. (నర్మదా నదీతీరంలో సూత్రభాష్యం, కాశిలో ఉపనిషద్భాష్యం వ్రాసి యుంటారని మహాస్వామివారి అభిప్రాయం ఆంగ్లానువాదకుడు)


శంకరులింటిదగ్గర ఉంటే వారి ఆయుర్దాయం ఎనిమిది సంవత్సరాలే. సన్న్యాసం పుచ్చుకోవడంవల్ల మరల 8 సంవత్సరాలు పొడిగించబడ్డాయి. కాశీయాత్రకు గురువులనుమతి ఇచ్చారు.


కాశీలో వైదిక మత ప్రచారం


కాశీక్షేత్రం, పవిత్రం, విద్వాంసులకు నిలయం. అనేక మతాచార్యులుంటారు. అందువల్ల అక్కడకు వెళ్ళవలసిందిగా గురువులదేశించారు. అక్కడ వైదిక మతాన్ని స్థాపిస్తే కలకాలం ఉంటుందని, పునః ప్రతిష్టింపబడాలని పంపారు.


గంగాతీరంలోని మణికర్ణికా ఘట్టం దగ్గర ఉన్న ముక్తి మంటపంలో వీరుపదేశించేవారు.


ఇది మోక్షపురి. అయోధ్య, మధుర, హరిద్వార్, అవంతి, ద్వారకలు కూడా మోక్షపురులే. ఏడవది దక్షిణ దేశంలో నున్న కంచ. సప్తమోక్ష పురులలో కంచిని, వైష్ణవ గురువులైన వేదాంత దేశికులు నుతించారు. కాశిలో ఉన్నట్లే కంచిలోనూ ముక్తి మంటపముంది. కంచి వచ్చినపుడు శంకరులుండేవారు. కనుక ఇప్పటికీ ఇక్కడే వ్యాస పూజ; కామాక్షి ఆలయంలోని శంకరులు విగ్రహాన్ని ఇక్కడికే తీసుకొని వస్తారు.


No comments:

Post a Comment