Thursday 22 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 199వ భాగం

 


"కాపీనవంతః ఖలు భాగ్యవంతః"

"తదేకోవశిష్టః శివః కేవలోఽహం" 

"సాక్షిణ్యతః ప్రత్యగాత్మా శివోఽ హం"

"అహం పరంబ్రహ్మ వాసుదేవాఖ్యం అవ్యయం" 

"అహం ఆనంద సాధ్యాది లక్షణః కేవలః శివః"

"చిదానంద రూపశ్శివోహం శివోహం"


(పై ఉదాహరణలు దశల్లోకి, అద్వైత పంచరత్న, బ్రహ్మానుచింతనం, అద్వైతానుభూతి, నిర్వాణ షట్కంలలో ఉన్నాయి)


అవి చదువుతూ ఉంటే ఒక అలౌకిక అనుభూతికి లోనవుతాం.


ఏక శ్లోక ప్రకరణంలో, ఒక్క శ్లోకంలో చైతన్య స్వరూపాన్ని వర్ణిస్తూ, కనబడే జగత్తు, దానిని చూచువాడు, అంతా చైతన్యమే అని వర్ణించారు. వారి బాల ప్రబోధ సంగ్రహం, ఒక అధ్యాపకుడు, ఒక చిన్న పిల్లవానికి బోధించునట్లుగా ఉంటుంది.


ఇక వారి ప్రశ్నోత్తరమాలికలో అనేక విషయాలు ప్రశ్న సమాధాన రూపంలో ఉంటాయి.


వారి భక్తి స్తోత్రాలు, అందరికీ ఉపయోగించివే. జ్ఞానానికి సంబంధించిన రచనలను కేవలం విద్వాంసులే అర్ధం చేసుకోగలరు. భక్తి స్తోత్రాలను చిన్నపిల్లలు కూడా నేర్చుకోవచ్చు. కానీ వీటిలోని విషయం గురించి విద్వాంసులు కూడా ఆశ్చర్య చకితులౌతున్నారు.


దేవతలపై కేశాంతస్తవం చేసారు. ఇక భాష్యాలు వచనంలో ఉన్నా, వారి ప్రకరణ గ్రంథాలు ఎక్కువ శ్లోకాల్లోను, కొద్దిగా వచనంలోను ఉంటాయి. స్తోత్రాలన్నీ శ్లోకరూపంలో ఉంటాయి. అవి అన్నీ అర్ధవంతాలు. అవి మనశ్శాంతిని ప్రసాదించే శక్తి గలవి.


No comments:

Post a Comment