Monday 26 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 203 వ భాగం



హంతపై దయ


ఏ సందర్భంలో ఆ నృసింహుడు పద్మపాదుల ఎదుట అవతరించాడో చెబుతా.


ఒక ప్రముఖ కాపాలికుడున్నాడు. పచ్చి మాంసం తినేవాడు, నరబలులిచ్చేవాడు. అట్టి కాపాలికులను ఎందరినో సాత్విక మార్గంలో శంకరులు పెట్టారు. కాని అట్టివారు వీరి వాదాన్ని అంగీకరిస్తారా? ఈ కాపాలికుడు శంకరుల వంటివారిని బలియిస్తే శివుడు, ప్రత్యక్షమౌతాడని భావించాడు. ఒక ఆత్మజ్ఞానిని గాని, లేదా ఒక రాజును గాని బలియిస్తే తన కోరిక నెరవేరుతుందని, రాజును బలియీయడం కుదరదు కనుక, మీరు కరుణామూర్తులు కనుక మిమ్ములనడుగుతున్నానని శంకరులతో అన్నాడు.


ఈ శరీరాన్ని అర్పిస్తే మరొకరికి ఈశ్వర సాక్షాత్కారం లభిస్తే ఇంతకంటే కావలసిందేముంది? ఎండుకట్టె ఉపయోగపడడం లేదా? చనిపోయిన జంతువు యొక్క కొమ్ము, ఏనుగు దంతమూ ఉపయోగిస్తున్నాయి. జంతువుల చర్మాలు ధ్యానానికి ఉపయోగిస్తున్నాయి. చనిపోయిన మానవ శరీరం మాత్రం ఎవ్వరికీ ఉపయోగపడడం లేదు. నా శిష్యులకు తెలియకుండా నేను ఏకాంతంగా ఉన్నపుడు నీ పని నీవు చేసుకోవచ్చని శంకరులన్నారు.


కాపాలికుడు శంకరులు ఏకాంతంగా ఉన్నపుడు కత్తి నెత్తాడు. ఎక్కడో ఉన్న పద్మపాదునకు, గురువునకు ఏదో ఆపద వస్తోందని అనిపించగా అతణ్ణి నృసింహుడావహించి ప్రత్యక్షమయ్యాడు. నరసింహస్వామి, ఆ కాపాలికుని సంహరించాడు. ఏమిటి నీకు నృసింహ ఉపదేశం ఉందా? అని ప్రశ్నించారు శంకరులు.


No comments:

Post a Comment