Saturday 10 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 187 వ భాగం



వల్లీయ సాహాయ్య కవి. శ్రీ శంకరాచార్య చంపువును వ్రాసేడు. అనగా గద్య పద్మాతకమైన గ్రంథం.


శ్రీ టి.ఎల్. వెంట్రామ అయ్యర్ గారి తండ్రియైన లక్ష్మణ సూరి ఒక మహావిద్వాంసుడు. వీరు న్యాయ శాస్త్రంలోనూ, సంగీతంలోనూ దిట్ట. వీరికి సూరి అనే బిరుదుంది. వైకుంఠంలో భగవానునితో ఉండే భక్తులను నిత్య సూరులని అంటారు. శంకరుల గ్రంథాలపై వారు వ్యాఖ్యానం వ్రాసేరు." మైసూర్ దివాన్ గా పనిచేసిన శేషాద్రి అయ్యర్ వీరికి సూరి అనే బిరుదు నిచ్చినవాడు. మహా మహోపాధ్యాయులు కూడా. వీరు చివరి రోజులలో భగవత్ పాదాభ్యుదయం అనే గ్రంథాన్ని వ్రాసేరు.


భగవత్ పాద సప్తతియనే పేరుతో రెండు గ్రంథాలున్నాయి. సప్తతి యనగా డెబ్బది. వేదాంత దేశికులు రామానుజులపై యతిరాజ సప్తతిని వ్రాసేరు. ఉమా మహేశ్వర శాస్త్రిగారు కూడా ఇట్టి సప్తతి వ్రాసేరు.


250 సంవత్సరాల వెనుక శృంగేరీ స్వామివారి ప్రోద్భలంతో వారి ఆస్థాన విద్వాంసులైన కాకి లక్ష్మణ శాస్త్రిగారు ఏడు సర్గలతో గురువంశ కావ్యాన్ని వ్రాసేరు. మొదటి మూడు సర్లలోనూ శంకరుల జీవిత చరిత్ర యుంది.


ప్రతి శంకర మఠంలోనూ గురు పరంపర ఉన్నాయి. కంచి మఠంలో పుణ్య శ్లోక మంజరి యుంది. అయితే వీటిల్లో కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. ప్రాచీన ఇతిహాస పురాణాలలోనూ పాఠ భేదాలున్నాయి. చెప్పబడినవి. అన్నిటిలోనూ ఉంటే వాటిని ప్రమాణంగా భావించవచ్చు. పెద్దగా మాత్రం భేదాలు లేవు.


శంకరులు ఏ ప్రాంతాలను దర్శించారనే విషయంలో అభిప్రాయ భేదాలుండవచ్చు. ఉదాహరణకు శంకరులు నైవేలీ వెళ్ళారని వ్రాసిన పుస్తకం ఉందనుకోండి. అసలు రనచా కాలంలో ఆ పేరుతో నున్నది లేకపోతే దానినెట్లా అంగీకరించగలం? బెర్నార్డు షాతో వివాదం చేసారని ఒకడు వ్రాస్తే నమ్ముతామా? కాని ఆనాటి ప్రాంతాలను కొందరు వ్రాసి, కొందరు వ్రాయనంత మాత్రంచే ప్రమాణం కాదని తిరస్కరించకూడదు. అనేక ప్రాంతాలను వారు దర్శించారు. కనుక అట్టి వాటిల్లో వివాదం పడనవసరం లేదు. పోలగం బ్రహ్మశ్రీ రామశాస్త్రి గారు శంకరులు చూపిన మార్గంలో పయనించడం మన కర్తవ్యమని అన్నారు. ఒక యోగి, అర్చిరాది మార్గంలో పయనిస్తున్నప్పుడు 13 స్థానాలుంటాయని చెప్పారు. ఆ స్థానాల వరుస విషయంలో ఉపనిషత్తులు రకరకాలుగా చెప్పాయని, ఉపనిషత్తుల్లో కొన్ని యుండి మరికొన్నింటిలో కొన్ని యుంటాయని, శంకరులు దానిని చూసి ఒక వరుసలో పెట్టి అందించారని అన్నారు. అట్లాగే ఒక శంకర విజయంలో కొన్ని ఉంటే మరొక దాంట్లో కొన్నియున్నాయన్న వాటిని శాస్త్రిగారు చెప్పినట్లు ఒక క్రమపద్ధతిలో పెట్టాలి. దేనినీ విడిచి పెట్టనవసరం లేదు. సమన్వయధోరణిని అలవర్చుకోవాలి.


No comments:

Post a Comment