Sunday 4 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 181 వ భాగం



శంకరులు ప్రార్థిస్తే తల్లికి ఆరోగ్యం కలిగి ఆమె వెళ్ళగలుగుతుంది. కాని గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండడం కోసం నదిని గమనం మార్చుకుని గ్రామ సమీపంలో వచ్చేటట్లు ప్రార్ధించారు. గమనం మారినపుడు దారిలో నున్న కృష్ణాలయానికి కొద్దిగా చేటు వచ్చింది.


కనకధారాస్తవం, నదీగమనం విని ప్రజలలో వీరిపట్ల భక్తిభావం ఏర్పడింది. రాజు కూడా విని వీరి దర్శనం కోసం వచ్చాడు. ఈ కృష్ణాలయాన్ని ఉద్ధరించవలసిందిగా రాజుతో అన్నారు. కృష్ణాలయం నేటికీ కాలడిలో ఉంది. నదీ తీరాన్నే ఎత్తుగా ఉండేటట్లు దాన్ని నిర్మించారు. మరల కృష్ణ ప్రతిష్ట జరిగింది. పూర్వం, ఆ నది, ఎంత దూరంలో ఉండేదో నేటికీ ప్రజలు చెబుతారు.

ఒక తల్లికే బిడ్డనా? ప్రపంచానికి బిడ్డను కదా అనే భావం వారిలో కలిగింది, ప్రజలకు అద్వైత బోధ చేయాలనే భావం వారిలో అంకురించింది. తల్లిని విడిచి జగత్కల్యాణం చేయాలని సంకల్పించారు. అవతారం, అందరికీ చెందిందే.


వీరికి తండ్రి గతించాడు. అతడు విముక్తుడో కాదో తెలియదు. కాని తల్లికి వీరివల్లనే వైకుంఠ ప్రాప్తి కలగాలని భగవత్సంకల్పం. బ్రహ్మచర్యాశ్రమం తరువాత గృహస్థాశ్రమం. తల్లి తృప్తికోసం గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలా? అయితే అవతార ప్రయోజనం సిద్ధించనట్లే.


ఆమె అనుజ్ఞ లేనిదే సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించకూడదు. ఆమె అంగీకరిస్తుందా? ఇదొక పథకం ప్రకారం సాగాలనుకున్నారు.


No comments:

Post a Comment