Sunday 13 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 250 వ భాగం



మాతృ మరణం


వీరి మాతృమూర్తికి చివరి ఘడియలలు రానే వచ్చాయి. అంత్యక్రియలను చేస్తానని మాట ఇచ్చారు కదా. గ్రహించి కాలడి వచ్చారు. స్తోత్రాలను వినిపించారు. అద్వైత ముక్తి రావాలనే వీరు కోరారు. అయితే ఆమెకది దక్కలేదు. అందువల్ల శివసంబంధ స్తోత్రాలను పఠించారు.


కైలాసం నుండి భూత గణాలు రాగా ఆమె భయపడింది. విష్ణు స్తోత్రమైన కృష్ణాష్టకాన్ని పఠించగా విష్ణు దూతలు వచ్చినట్లు, ఆమెకు వైకుంఠ ప్రాప్తి కల్గినట్లు ఐతిహ్యం.


అంత్య క్రియలు చేయబోతే అక్కడున్న పండితులు సన్యాసికి ఇట్టి అర్హత లేదని ఎదుర్కున్నారు. వారు సహకరించలేదు.


అందుచేత వీరు మాతృశవాన్ని ఇంటి పెరటిలోనికి తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు జరిపారు. ఈనాటికీ నంబూద్రీలు అట్లా చేస్తారు.


అక్కడ రెండు కుటుంబాల వారు వీరికి సహాయానికి వచ్చారని, ఇంటి పెరడులోని శరీరం తలదగ్గర, కాళ్ళ దగ్గర వారు నిలబడ్డారని అంటారు.


No comments:

Post a Comment