Tuesday 1 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 238 వ భాగం



వారు ప్రేమ మూర్తులు కనుకనే వారిని 'కరుణాలయం' అంటారు. శుష్క వేదాంతీయనడం సబబు కాదు. ప్రేమమూర్తియని మరువకూడదు. ఇక నెహ్రూ తన డిస్చొవెర్య్ ఒఫ్ India లో శంకరుల సమగ్ర స్వరూపాన్ని గుర్తించి వ్రాసినట్లు ఇట్లా ఉంది:


A Philosopher, a mystic and a poet all rolled into one. Among with all this instead of remaining aloof in a corner he acts in the practical way to bring about reforms and he was a great expert in this.


మఠాల నేర్పరచడంలో, తద్వారా మత సంరక్షణలో వీరు ఘటికులని అన్నారు నెహ్రూ. శంకరుల ముందు మఠవ్యవస్థ లేదు. మతం, తపశ్శక్తి ద్వారానే వృద్ధి పొందుతుందని గుర్తించండి. శంకరులు సనాతనవాదియైతే నెహ్రూ భౌతికవాది.


జాతీయ సమైక్యమనేది, యుద్ధాలవల్ల, రాజకీయాల వల్ల, ఆర్ధిక సాంఘిక సంస్కరణల వల్ల సాధ్యమయ్యేది కాదు. భక్తిద్వారానే, అందరూ భగవంతుని సంతానమే అని భావించడం ద్వారానే ఇది సాధ్యం. వీరు జ్ఞాన, భక్తి స్వరూపులు కనుక దానిని సాధించగలిగారు.


కేవలం భక్తి జ్ఞానాల గురించి చెబితే సరిపోయిందా? పరస్పర ద్వేషాలు లేని, ఎక్కువ తక్కువలు లేని వర్ణాశ్రమ వ్యవస్థ వల్లనే ఇది సాధ్యమని భావించారు. ఇట్టి దానిని ఆధునిక సంస్కర్తలు గుర్తించరు. వారికి, వీరికీ గల తేడాను గుర్తించండి.


వారు తలపెట్టిన పనులేమీ చేయకుండా వారి పేరును స్మరిస్తూ జయంతిని జరుపుకున్నా ఏం లాభం?


No comments:

Post a Comment