Thursday 6 June 2024

శ్రీ గరుడ పురాణము (197)

 


పదవ మనువు ధర్మసావర్ణి. అతని పుత్రులు సుక్షేత, ఉత్తమౌజ, భూరిశ్రేణ్య, శతానీక, నిరమిత్ర, వృషసేన, జయద్రథ, భూరిద్యుమ్న, సువర్చ, శాంతి, ఇంద్రులు. ఈ మన్వంతర సప్తర్షులు అయోమూర్తి, హవిష్మాన్, సుకృతి, అవ్యయ, నాభాగ, అప్రతిమౌజ, సౌరభ మహామునులు, ప్రాణి నాయకులొక వంద దేవగణాల వారుంటారు. మహాబలశాలియు శాంతియను పేరుగలవారును నగు దేవపురుషుడింద్రుడవుతాడు. అతని శత్రువైన బలియను అసురుని విష్ణువు తన గదతో సంహరిస్తాడు.


పదకొండవ మనువైన రుద్రసావర్ణి కొడుకులు సర్వత్రగ, సుశర్మ, దేవానీక, పురు, గురు క్షేత్రవర్ణ, పుత్ర, దృడేషు ఆర్ట్రక నామకులు. ఈ మన్వంతరంలోని సప్తర్షులు హవిష్మాస్ హవిష్య, వరుణ, విశ్వ, విస్తర, విష్ణు, అగ్నితేజ మహామునులు. విహంగమ, కానుగను, నిర్మాణ, రుచి అను పేర్లతో నాలుగు దేవగణాలు ఒక్కొక్కటీ ముప్పదేసిమంది దేవతలతో వర్ధిల్లగలవు. వృషభుడను దేవపురుషుడు దేవేంద్రుడు కాగా అతని శత్రువైన దశగ్రీవ దైత్యుని విష్ణువు లక్ష్మీరూపమున అవతరించి వధిస్తాడు. ఈ రుద్రసావర్ణి మనువు శివపుత్రుడు.


తరువాత దక్షపుత్రుడైన దక్షసావర్ణి పన్నెండవ మనుపదవినధిష్టిస్తాడు. ఆయన పుత్రులు, దేవవాన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ, విదూరథ, మిత్రవాన్, మిత్రదేవ, మిత్రబిందు, వీర్యవాన్; మిత్రవాహ, ప్రవాహులు. ఈ మన్వంతరంలో సప్తర్షులుగా తపస్వి, సుతవ, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, ద్యుతి, తపోధన నామధేయులైన మహామునులు ప్రవర్తిల్లుతారు. స్వధర్మ, సుతపస, హరిత, రోహిత దేవగణాలుంటాయి. ప్రతి గణంలోనూ పదేసిమంది దేవతలూ, మొత్తం జాతికి ఋతధాముడను దేవేంద్రుడూ ఉంటారు. దేవశత్రువైన తారకాసురుని విష్ణువు నపుంసక స్వరూపమును ధరించి వధిస్తాడు.


పదమూడవ మనువు రౌచ్యుడు. ఆయన పుత్రులు చిత్రసేన, విచిత్ర, తప, ధర్మరత, ధృతె, సునేత్ర, క్షేత్రవృత్తి, సునయులు. ధర్మ, దృతిమంత, అవ్యయ, నిశారూప, నిరుత్సక, నిర్మోహ, సుధర్మ, సుకర్మ దేవగణాలు ముప్పది మూడేసి మంది దేవతలతో వర్ధిల్లుతాయి. దివస్పతి ఇంద్రుడు కాగా ఆయన శత్రువైన త్వష్టిభుడను దైత్యుని శ్రీమహా విష్ణువు మయూర స్వరూపంలో వచ్చి వధిస్తాడు.


పదునాల్గవ మనువు విష్ణుపుత్రుడైన భౌత్యుడు. ఆయన పుత్రులు ఊరు, గభీర, ధృష్ట, తరస్వీ, గ్రాహ, అభిమాని, ప్రవీర, జిష్ణు, సంక్రందన, తేజస్వి, దుర్లభులు. అగ్నీధ్ర, అగ్నిబాహు, మాగధ, శుచి, అజిత, ముక్త, శుక్రమహామునులు సప్తర్షులు. చాక్షుష, కర్మనిష్ఠ, పవిత్ర, భ్రాజిన, వచోవృద్ధి దేవగణాలు ఒక్కొక్క గణంలో మరల ఏడేసి ఉపగణాలతో వర్ధిల్లుతాయి. ఈ మన్వంతరానికి శుచి దేవేంద్రుడు కాగా అతని శత్రువైన మహాదైత్య నామక దైత్యుని శ్రీమహా విష్ణువే స్వస్వరూపంలో దిగి వచ్చి వధిస్తారు.


(ఆచార - 87)


No comments:

Post a Comment