Wednesday 26 June 2024

శ్రీ గరుడ పురాణము (217)

 


వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం - గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం


బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కనిన పుత్రునితో మూర్ధావసిక్త అనే సంకరజాతి ప్రారంభమైంది. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ఠ, బ్రాహ్మణ శూద్ర సంకరంలో పారశవనిషాద జాతులు పుట్టుకొచ్చాయి. దీనిని అనులోమ సంకరమన్నారు.


పురుష     శ్త్రీ    సంకరజాతి పేరు


క్షత్రియ    వైశ్య     మాహిష్య

క్షత్రియ    శూద్ర    మ్లేచ్ఛ 

'యాజ్ఞవల్క్య స్మృతిలో మ్లేచ్ఛ పదానికి బదులు 'ఉగ్ర' యను పదం వాడబడింది.


వైశ్య     శూద్ర    కరణ

(మూర్ధవసిక్త, అంబష్ట, నిషాద, మాహిష్య, ఉగ్ర, కరణ- ఈ ఆరు సంకరజాతులనూ అనులోమజలన్నారు.) 

క్షత్రియ   బ్రాహ్మణ సూత

వైశ్య     బ్రాహ్మణ వైదేహక

శూద్ర    బ్రాహ్మణ చాండాల

వైశ్య     క్షత్రియ  మాగధ 

శూద్ర    వైశ్య   అయోగవ

(సూత, వైదేహక, చాండాల, మాగధ, క్షత్తా, ఆవయోగ జాతులను ప్రతిలోమజలన్నారు.)

శూద్ర    కరణ   రథకార


సంకరం వల్ల చెడిన వర్ణం మరల పాతదశకు రావాలంటే ఆరు తరాలు పడుతుంది. అంటే బ్రాహ్మణునికీ శూద్రునికీ పుట్టిన సంతానాన్నీ నిషాదులన్నాము కదా. ఆ నిషాదుని కొక కూతురు పుట్టి,దానినొక బ్రాహ్మణుడు పెండ్లాడి, వారికొక కూతురు పుట్టి, దానినీ బ్రాహ్మణుడేమనువాడి... అలా నిషాద, బ్రాహ్మణ వివాహం ఆరు తరాల బాటు కొనసాగితే ఏడవతరం నిషాదునికి కూతురు పుట్టి ఆమెను కూడా బ్రాహ్మణుడే పెళ్ళిచేసుకుంటే అప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఏడవతరం వారవుతారు కదా! వారికి శుద్ధ బ్రాహ్మణ వర్ణాన్ని శాస్త్రాలు ప్రసాదిస్తున్నాయి. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరమైన అంబష్ట జాతిలో అయిదవతరానికి పుట్టినవారు అనగా ఆరవ తరంవారు శుద్ధ బ్రాహ్మణులవుతారు. అలాగే మూర్ధావసిక్తజాతిలో అయిదవ తరంవారు శుద్ధబ్రాహ్మణులౌతారు. ఇదే విధంగా ఉగ్రా, మాహిష్యా జాతులలోనూ ఏడవ ఆరవ తరాలలో శుద్ధ క్షత్రియులుద్భవిస్తారు. అదే విధంగా కరణనామక సంకరజాతిలో ఆరవతరంలో శుద్ధ వైశ్యులుద్భవిస్తారు. అనగా సంకరదోషం పితృవర్ణ బీజం ఆరేడుతరాల పాటు అనుస్యూతంగా ప్రవహిస్తే గాని కడుక్కుపోదు.


No comments:

Post a Comment