Thursday 8 August 2024

శ్రీ గరుడ పురాణము (259)

 


పీనాసివాని ధనం యజ్ఞాలకు ఉపయోగపడదు (వాడు చేయడు కాబట్టి) బ్రాహ్మణులను చేరదు (వాడివ్వడు కాబట్టి) చివరికది చేరేది రాజును (లాక్కుంటాడు కాబట్టి) లేదా దొంగను. (దోచుకుంటాడు కాబట్టి).


విద్యను నిరంతరం అధ్యయనమో, అభ్యాసమో చేసుకుంటూ వుండకపోతే దానిని మరిచిపోతాం. శక్తి కూడా అంతే.


దొంగని క్షమించడంగాని చిన్న శిక్ష వేసి ఊరి మీదికి వదలి వేయడంగాని కూడదు. వానికి సరైన శిక్ష మరణదండనే. దుష్టుడైన మిత్రుని దూరంగా వుంచాలి. ఎదురైతే పలకరించి ఎలాగో పారిపోవాలి. అదే వానికి శిక్ష. స్త్రీకి సరైన శిక్ష ఆమెను తన శయ్యపై కాకుండా వేరే ఒంటరిగా పడుకోబెట్టడం. బ్రాహ్మణునికి శిక్ష వానిని దేనికీ పిలవక పోవడమే.


పనిని పెంచడం ద్వారా భృత్యునీ, దుఃఖం కలిగించే సంఘటన వచ్చినపుడు బంధు బాంధవులనూ, విపత్కాలంలో మిత్రునీ, ఐశ్వర్యం నష్టమైపోయినపుడు స్త్రీనీ జాగ్రత్తగా గమనించక్కరలేకుండానే వారి రంగులు బైటపడతాయి.


జానీయాత్ ప్రేషణే భృత్యాన్ 

బాంధవాన్ వ్యసనాగమే । 

మిత్రమాపది కాలే చ 

భార్యాంచ విభవక్షయే ॥


(ఆచార ...109/32)


స్త్రీకి పురుషుని కన్నా రెండింతలు ఆహారమూ, నాల్గింతలు బుద్ధి, ఆరింతలు ఓపికా, ఎనిమిది రెట్లు కామ వాంఛా వుండాలనీ, వుంటాయనీ పెద్దలంటారు.


No comments:

Post a Comment