Monday 2 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (71)

 

శాప విముక్తి


చంద్రుడు లేకపోతే రాత్రిళ్ళు ప్రజలకు గడవడం కష్టమైంది. ఓషధులుండాలన్నా చంద్రుడుండవలసిందే. అన్నిచోట్లా రోగాలు ప్రబలు తున్నాయి. ఓషధులు లేవు. ఇంతవరకూ చల్లని వెన్నెలనుభవించిన వారు నిరుత్సాహులై యున్నారు.


ప్రజల పట్ల జాలిపడి దేవతలు, ఋషులు బ్రహ్మను వేడుకున్నారు. 


ఏదైనా కష్టం వస్తే త్రిమూర్తులలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళడం ఆనవాయితీ. సాధారణంగా ఆయనే పరిష్కరిస్తూ ఉంటాడు. తనకు సాధ్యం కాకపోతే శివుని దగ్గరకో, విష్ణువు దగ్గరకో వెళ్ళండని చెబుతూ ఉంటాడు.


శాపం తొలగించండని అడిగారు. మహాగణపతి శపిస్తే నేనెట్లా తొలగించనయ్యా! పరమేశ్వరుడే త్రిప్పలేడు, నేనెంత? ఎవరు శపించారో వారి దగ్గరకు వెళ్ళండని బ్రహ్మ అన్నాడు. ప్రత్యేకమైన పూజ చేయండి, మోదకాలు సమర్పించండి, అతని గుండె కరిగి మీకు సరియైన మార్గాన్ని చూపిస్తాడని అన్నాడు.


సాధారణంగా వ్రతమంటే పగలు తిని రాత్రియందు తినకుండా ఉంటారు. ఈ పద్ధతి కొన్ని వ్రతాలలో తలకిందులుగా ఉంటుంది. పగలు ఉపవాసం ఉండి, పూజ చేసుకుని రాత్రియందు భుజించే వాటినీ వ్రతాలని అంటారు.


నక్తం అంటే రాత్రి, Nocturnal అనే పదం దీనినుండే వచ్చింది. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి ప్రీతి.

No comments:

Post a Comment