Sunday 1 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (70)

దానినినట్లా ఉంచు. అందంకంటె శీలం ప్రధానం కదా! నీవు చేసిన 'నిర్వాకం' ఏమిటి? భార్యల పట్ల పక్షపాతం చూపించలేదా? దక్షుని శాపం వల్ల కృణించి పోతున్నావు కదా! 27 నక్షత్రాలలో రోహిణి పట్ల మక్కువ చూపించడం, దక్షుని శాపం తెలిసిందే కదా. నిన్ను ఉద్దరించినవాడు నా తండ్రియైన శివుడని గుర్తుందా? తదియనాటి చంద్రుణ్ణి శిరస్సున ధరించి క్రమక్రమంగా కృష్ణపక్షంలో కృశించి పోవడాన్ని నా తండ్రి అడ్డుకోలేదా? మాసంలో శుక్లపక్షంలో క్రమక్రమంగా పుంజుకొంటావనే భరోసా ఇద్చాడు కదా. నా తండ్రి అనుగ్రహమొక పక్షంలో మరొక పక్షంలో, నీ తప్పిదమూ గుర్తుకు రావడం లేదా? ఇక నీ గురుపత్నిని ఏం చేసావో అందరికీ తెలుసు. అది పైకి చెప్పలేని సంగతి, ఇవన్నీ తెలిసి ఏదో చల్లని కాంతిని ప్రసరిస్తున్నావని ఈ మిడిసిపాటేమిటి ?


ఇకనుండి నీ అందాన్ని చూడడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఒకవేళ చూస్తే వారికి నీ కళంకం అంటుకొంటుందని శపించాడు.

శాప ఫలం

తాము అందంగా అందరి కంటే ఉన్నామని గర్వించిన వారికి శిక్ష ఏమిటి? వారి ముఖాన్ని చూడకుండా ఉంటే అదే చాలు కదా. నీ కన్నులకు గ్రుడ్డితనం వస్తుందనో, శిలగా పడియుండమనో శపించలేదు. నిన్ను చూసిన వారికే కళంకం, నింద కల్గుతాయని అన్నాడు. ఈ పద్ధతి బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. నాకీ నింద పడింది, నేను చంద్రుణ్ణి చూడడం వల్లనే కదా అని మాటిమాటికీ నిందిస్తూ ఉంటారు కదా!

మరొక కారణాన్ని ఊహించవచ్చు. ప్రజలలో గ్రుడ్డిగా తమకు నచ్చిన నాయకుణ్ణి పొగుడుతూ ఉంటారు. శీలాన్ని పట్టించుకోరు. ఇట్టి సాధారణ జనుల మనః ప్రవృత్తిని గమనించి అట్లా శపించి యుంటాడు.

మదమెక్కి గర్వంతో చూసేవాణ్ణి ముఖమెత్తి చూడకుండా ఉండడమే తగిన శిక్ష. అట్టివారిని పొగడడం, వీళ్ళ శీలాన్ని కళంకితం చేసుకోవడమే.

చంద్రుడు సిగ్గుతో తల దించుకున్నాడు. భయపడ్డాడు. తననెవ్వరూ చూడడం లేదు. ఎవరైనా చూసినా శాపం వల్ల వారికి నీలాపనిందలు వస్తున్నాయి. సిగ్గుపడి తాను పుట్టిన సముద్రంలో మునిగిపోయాడు.

No comments:

Post a Comment