Friday 20 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (89)

దేవతల విఘ్నాలను పోగొట్టినవాడు


ఏ పురాణం ఆరంభించినపుడైనా అసలు వాగ్దేవిని, విద్యాదేవిని స్మరించడం సబబు. కాని అంతకంటే ముందు గణపతిని నుతిస్తాం. వాగ్దేవిని పూజించడానికి కూడా ఏదైనా ఆటంకం వస్తే ఏం జరుగుతుంది? అందువల్ల ముందుగా గణపతిని పూజించవలసిందే.  


మరొక ముఖ్య కారణముంది. మనం పూజించేటపుడే కాదు. దేవతలు మనలను ఆశీర్వదించాలన్నా ఏదైనా వారికి ఆటంకం రావచ్చు. ఇట్లా .జరుగుతుందా? పార్వతీ పరమేశ్వరులు, మహావిష్ణువు, అతని అవతారాలు సుబ్రహ్మణ్య స్వామి మిగిలిన దేవతలు వారనుకొన్నవి జరుగకపోతే వారే గణపతిని పూజించినట్లు పురాణాలలో కావలసిన కథలున్నాయి. శ్లోకంలో బ్రహ్మాది దేవతలని ఉంది కదా! అంటే అంతటివారే ఇతణ్ణి అర్చించవలసి వచ్చింది. పూజిస్తేనే కాని వారి పనులు జరగలేదు. పుస్తకం వ్రాసినపుడు సరస్వతిని ప్రార్ధించినా డబ్బుకోసం లక్ష్మిని పూజించినా, రోగవిముక్తి కోసం సూర్యుణ్ణి ఆరాధించినా మునుముందుగా ఆయా దేవతలు కరుణించడానికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే ముందుగా మనం గణపతిని పూజించవలసిందే. అప్పుడే దేవతలు మనపై అనుగ్రహం చూపించగలరు.


అది రుద్రాభిషేకం కావచ్చు, చండీహోమం కావచ్చు, ఏదైనా ముందుగా శుక్లాంబరధరం శ్లోకం చదువకుండా ఆరంభించం.

No comments:

Post a Comment